Israel PM: ఓయబ్బ అదేం త్యాగం రా నాయనా..నెతన్యాహుకు ఇజ్రాయెలీల కౌంటర్

ఇన్నాళ్ళు హమాస్, ఇప్పుడు ఇరాన్ తో ఎడతెగని యుద్ధాలు చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లడిన మాటలపై స్వదేశంలోనే తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొడుకు పెళ్ళి వాయిదా వేసి త్యాగం చేశానంటూ నెతన్యాహు మాట్లాడ్డమే దీనికి కారణం.

New Update
Israel Pm

Israel PM Netanyahu

Israel PM: ఇరాన్ లో అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడ క్షిపణులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఆ దేశం ప్రయోగించిన బాంబులు ఇజ్రాయెల్ లో ఓ ఆసుపత్రిపై పడ్డాయి. ఇందులో దాదాపు 71 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రి నేలమట్టం అయింది. ఈ దాడిని ఆ దేశ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. దీనికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించకోకతప్పదని హెచ్చరించారు. అయితే ఆ సందర్భంలోనే ఆయన మట్లాడిన మరో విషయం గురించి మాత్రం ఇజ్రాయెల్ ప్రజలు ఏకి పారేస్తున్నారు. 

Also Read: ఇండిగో విమానంలో చిక్కుకున్న మరో మాజీ CM

అదెలా త్యాగం రా నాయనా..

ఇరాన్ తో యుద్ధం గురించి నెతన్యాహు మాట్లాడుతూ తన కొడుకు పెళ్ళి ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. ఇరాన్ దాడుల్లో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలు వేదన అనుభవిస్తున్నాయి. మనలో ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత నష్టం జరుగుతోంది. అందరూ త్యాగాలు చేయాల్సి వస్తోంది. నా కుటుంబం కూడా దానికి మినహాయింపు కాదు. యుద్ధం కారణంగా నా కుమారుడు అవ్నర్‌ పెళ్లిని రెండోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది అవ్నర్‌ వివాహం చేసుకోబోయే అమ్మాయి, నా భార్య సారాపై తీవ్ర మానసిక ప్రభావం చూపిస్తోంది.

Also Read: USA: ఇరాన్ పై దాడులు.. రెండు వారాల్లో నిర్ణయిస్తారు..వైట్ హౌస్

ఈ ప్రతికూల పరిస్థితిని తట్టుకుంటున్న ఆమె ఓ హీరో అని నెతన్యాహు చెప్పుకొచ్చారు.  దీనిపై ఇజ్రాయెలీలు మండిపడుతున్నారు. నెతన్యాహు ఏం మాట్లాడుతున్నారు. కొడుకు పెళ్ళి వాయిదా ఎలా త్యాగం అవుతుంది అంటూ విమర్శిస్తున్నారు. యుద్ధాల్లో పాల్గొంటున్న వారు, వారి కోసం పని చేస్తున్న డాక్టర్లు వారు కదా నిజమైన హీరోలు. వాళ్ళు చేస్తున్నది కదా నిజమైన త్యాగం అంటే. ఈ ఉద్రిక్తతల కారణంగా మేమంతా నరకం అనుభవిస్తుంటే మీరు పెళ్లి వాయిదా వేయడాన్ని త్యాగంగా భావిస్తున్నారా? అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. 

Also Read: డీఎంకే కుటుంబంలో కలహాలు..ఆస్తి కోసం సోదరుల తగువులు

నిజానికి గాజాపై దాడులు జరుగుతున్నప్పటి నుంచీ నెతన్యాహు కుమారుడి వివాహం వివాదాస్పదం అవుతోంది. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. ఆయన ఇంట వేడుకలు నిర్వహిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అప్పట్లో ఆయన అవ్నర్‌ పెళ్లిని వాయిదా వేశారు. ఇప్పుడు పెళ్ళి చేద్దామనుకుంటే ఇరాన్ తో యుద్ధం మొదలైంది. అందుకే దాన్ని మళ్ళీ వాయిదా వేశారని తెలుస్తోంది. 

Also Read: Telegram CEO: సంపద అంతా నా వంద మంది పిల్లలకే..టెలీగ్రామ్ సీఈవో పావెల్

 

Advertisment
Advertisment
తాజా కథనాలు