/rtv/media/media_files/2024/11/13/nuYLb9IhbMl7ptr1A7Tb.jpg)
Telegram CEO Pavel Durov
టెలీగ్రామ్ సీఈవో పావల్ దురోవ్...ఇతని గురించి అందరికీ తెలిసిందే. పెళ్ళవకపోయినా పావెల్ కు వంద మంది సంతానం ఉన్నారు. వీర్యదానం చేసి వార్తల్లో నిలిచిన ఇతను ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ తన సంపదను పంచేస్తానని పావెల్ ప్రకటించారు. దీనికి సంబంధించి భవిష్యత్ ప్రణాళిక కూడా చెప్పారు.
పావెల్ దురోవ్ రష్యన్ మూలానికి చెందినవాడు. ప్రస్తుతం దుబాయ్లో నివసిస్తున్నాడు.ఫోర్బ్స్ అంచనా ప్రకారం డ్యూరో నికర విలువ $15.5 బిలియన్లు. దురోవ్, అతని సోదరుడు నికోలాయ్ 2013లో టెలిగ్రామ్ను స్థాపించారు. టెలిగ్రామ్ను స్థాపించడానికి ముందు, పావెల్ దురోవ్ రష్యాలో VK అనే సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ను స్థాపించారు. ఇతనికి ఫ్రెంచ్ పౌరసత్వంతో పాటూ, UAE పౌరసత్వాన్ని కూడా కలిగి ఉన్నాడు.
వంద మందికీ సంపద..
గతేడాది జులైలో పావెల్ 15 ఏళ్ళ పాటూ వీర్యదానం చేసి ప్రపంచ వ్యాప్తంగా 12 దేశాల్లో 100 పిల్లలకు జన్మనిచ్చినట్టు ప్రకటించారు. అప్పుడు అదో పెద్ద సంచలనం అయింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో దీని గురించి ఇంకో సారి మాట్లాడారు. రీసెంట్ గా తాను వీలునామా రాశానని..అందులో తాను సహజంగా జన్మనిచ్చిన సంతానంతో పాటు ఈ 100 మంది పిల్లలకు కూడా తన ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని పావెల్ చెప్పారు. అయితే తన సంపదను 30 ఏళ్ళు వచ్చే వరకు పొందలేరని అన్నారు. పిల్లలు స్వతంత్రంగ జీవించేలా ఎదగాలని కోరుకుంటున్నానని...అందుకే అలా వీలునామా రాశానని చెప్పారు పావెల్ దురోవ్. వివాహం కానప్పటికీ తనకు ముగ్గురు సహజీవన భాగస్వాములు ఉన్నారని, వారికి ఆరుగురు సంతానం అని టెలిగ్రామ్ సీఈఓ తెలిపారు. తన జీవితం ఎన్నో సవాళ్లతో ముడిపడి ఉందని, ఎంతోమంది శత్రువులు ఉన్నారని..అందుకే, 40 ఏళ్ల వయసులోనే వీలునామా రాయాల్సి వచ్చిందని తెలిపారు పావెల్.
Also Read: Iran-Israel War: 8వ రోజుకు చేరుకున్న యుద్ధం..క్లస్టర్ బాంబ్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్