/rtv/media/media_files/2025/05/21/geT59fqZdgn2TiFaAhxu.jpg)
More severe weather pummels the central US as thousands recover from deadly tornadoes
అమెరికాను టోర్నడోలు వణికిస్తున్నాయి. మధ్య అమెరికా రాష్ట్రాల్లో సోమవారం నాలుగు టోర్నడోలు సంభవించాయి. వీటి ధాటికి టెక్సాస్ నుంచి కెంటకీ వరకు ఉన్న ప్రాంతాల్లో కొన్ని భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అనేకచోట్ల విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఓక్లహామాలో అగ్నిమాపక కేంద్రంతో పాటు కనీసం 10 నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతాల్లో దాదాపు 1,15,000 మంది చీకట్లోనే ఇరుక్కుపోయారు. టోర్నడోల ధాటికి ఇప్పటిదాకా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: ఇద్దరు బంగ్లా దేశీయులకు బిగ్ షాక్.. ఆ కేసులో కఠిన కారాగార శిక్ష
అలాగే పలు జాతీయ రహదారులు కూడా దెబ్బతిన్నాయి. దీంతో రవాణా సరఫరా నిలిచిపోయింది. అధికారులు వాహనాలు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు. మరోవైపు ఉత్తర టెక్సాస్లో వడగళ్లు బీభత్సం సృషించాయి. అక్కడ ఏకంగా 11.4 సెంటీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి వడగళ్లు పడ్డట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read: జ్యోతి మల్హోత్రా డైరీ స్వాధీనం.. వెలుగులోకి సంచలన విషయాలు
ఇదిలాఉండగా సెయింట్ లూయిస్లో దాదాపు 5 వేల భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం వల్ల ఏకంగా 1 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ టోర్నడోల ప్రభావానికి కెంటకీ రాష్ట్రం తీవ్రంగా దెబ్బతింది. గతకొన్ని రోజులుగా అక్కడ వస్తున్న విపత్తుల కారణంగా ఇప్పటిదాకా 24 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. మళ్లీ టొర్నడోలు ఎక్కడ సంభవిస్తాయో తెలియక అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Also read: స్వర్ణ దేవాలయంలో ఎయిర్ డిఫెన్స్ గన్.. క్లారిటీ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ
Also Read: చావుబతుకుల్లో లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజా
telugu-news | rtv-news | national-news | usa | tornado