/rtv/media/media_files/2025/06/17/XZNGDKMz5aLs2wKu00Lq.jpg)
America enters the war
Iran-Israel War: ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం పశ్చిమాసియాలో ప్రపంకలను సృష్టిస్తోంది. ఇరాన్కు వ్యతిరేకంగా జీ7 దేశాల మద్ధతు కూడగట్టడంలో విజయం సాధించిన ట్రంప్ ఇజ్రాయెల్కు మద్దతుగా యుద్ద రంగంలోకి నేరుగా దూకడానికి సిద్ధమవుతున్నారు(trump entry to iran israel war). అమెరికా యుద్ధంలో చేరితే ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఎక్కడ ఉన్నాడో తెలుసునని హెచ్చరించాడు. దీనికి బదులుగా ఖమేనీ చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘యుద్ధం మొదలైంది’ అంటూ ఆయన పోస్ట్ చేశారు.
Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !
ఖమేనీ ఎక్కడ దాక్కొన్నారో తమకు తెలుసని పేర్కొన్న ట్రంప్.. ప్రస్తుతానికి చంపాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఖమేనీ బేషరతుగా లొంగిపోవాలని లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని హెచ్చరించారు. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఖమేనీ ‘ఎక్స్’ ఖాతాలో ఓ పోస్ట్ కన్పించింది. ‘నమి పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్తో(కత్తి) కలిసి ఖైబర్కు వచ్చేశారు’’ అని అందులో రాసుకొచ్చారు. దీనికి తోడు కత్తి పట్టుకొని కోట గేటు వద్ద ఉన్న ఓ వ్యక్తి ఫొటోను దీనికి జత చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఆ చిత్రంలో ఉంది. ఈ పోస్ట్ను యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాలున్నాయని తెలుస్తోంది.
ఇజ్రాయెల్ పై క్షిపణి దాడి
ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారు జామునుంచే తిరిగి యుద్ధం మొదలైంది(iran israel war news ). ఇరు దేశాల మధ్య క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. టెహ్రాన్లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. సైరన్లు మోగాయి. అటు టెల్ అవీవ్లోనూ పేలుళ్లు సంభవించాయి. ఉద్రిక్తతల దృష్ట్యా జెరూసలెంలోని అమెరికా ఎంబసీని వచ్చే శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఇజ్రాయెల్పై హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది.
నెతన్యాహుకు ట్రంప్ ఫోన్
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమైన నేపథ్యంలో యుద్ధరంగంలోకి అమెరికా కూడా ప్రత్యక్షంగా అడుగుపెట్టనుందనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల మేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేశారు. సిచువేషన్ రూమ్లో కీలక భేటీ అనంతరం ట్రంప్.. నెతన్యాహుతో మాట్లాడారు. యుద్ధ సన్నద్ధతపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా సైన్యాన్ని ఇరాన్ వైపు మొహరించనున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ కు మద్ధతుగా అమెరికా యుద్ధంలోకి దిగే అవకావాలు కనిపిస్తున్నాయి.
Also Read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?
అణుకేంద్రాలే లక్ష్యంగా రంగంలోకి..
ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయాలని అమెరికా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలను దెబ్బకొట్టాలని అమెరికా భావిస్తోంది. పర్వతం లోపల లోతుగా దాచబడిన ఫోర్డో ప్లాంట్ను ధ్వంసం చేసేందుకు వైట్హౌస్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం GBU-57 బంకర్ బస్టర్ బాంబును ప్రయోగించనున్నట్లు ఆక్సియోస్ నివేదించింది. ఫోర్డో ప్లాంట్ను ధ్వంసానికి B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు ప్రత్యేకంగా పని చేయగలవని యూఎస్ సైన్యం భావిస్తోంది. GBU-57 బంకర్ బస్టర్.. లోతుగా పాతిపెట్టబడిన లక్ష్యాలను నాశనం చేయగల సామర్థ్యం ఉంటుందని ఆక్సియోస్ స్పష్టం చేసింది. ఇది 61 మీటర్ల వరకు భూగర్భంలోకి చొచ్చుకు పోగలదు. అనుకున్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దీని సొంతం. ఇరాన్ అణు స్థావరాలు నాశనం చేయడం అమెరికా ఆయుధ సామగ్రికే సాధ్యమని ఇజ్రాయెల్ కూడా భావిస్తోంది. ప్రస్తుతం అమెరికాకు చెందిన అత్యాధునిక బాంబర్లు హిందూ మహాసముద్రంలోని డియెగో గార్సియాలోని అమెరికా-బ్రిటిష్ సైనిక స్థావరంలో మోహరించి ఉన్నాయి. ఇరాన్ నుంచి దాదాపు 2,358 మైళ్ళు (3,796 కి.మీ) దూరంలో ఇవి ఉన్నాయి. కార్యకలాపాలు నిర్వహించే పరిధిలోనే ఈ బాంబర్లు ఉన్నట్లుగా బీబీసీ తన నివేదికలో పేర్కొంది.