Iran: వాట్సాప్‌ను డిలీట్‌ చేయండి.. ఇరాన్ సంచలన ప్రకటన

తమ దేశంలో ఉండే ప్రజలు వెంటనే స్మార్ట్‌ఫోన్ల నుంచి వాట్సాప్‌ను తొలిగించాలని ఇరాన్ సూచనలు చేసింది. ప్రజల సమాచారాన్ని వాట్సాప్‌ సేకరించి ఇజ్రాయెల్‌కు పంపిస్తోందని తెలిపింది.

New Update
Iran urges public to delete WhatsApp, claiming app gathered information for Israel

Iran urges public to delete WhatsApp, claiming app gathered information for Israel

ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ దేశంలో ఉండే ప్రజలు వెంటనే స్మార్ట్‌ఫోన్ల నుంచి వాట్సాప్‌ను తొలిగించాలని ఇరాన్ సూచనలు చేసింది. ప్రజల సమాచారాన్ని వాట్సాప్‌ సేకరించి ఇజ్రాయెల్‌కు పంపిస్తోందని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థలో ఈ ప్రకటన విడుదలైంది.  

Also Read: వాహనదారులకు గుడ్ న్యూస్..రూ.3వేలకే ఏడాదంత ట్రిప్స్

మరోవైపు దీనిపై వాట్సాప్‌ స్పందించింది. '' ప్రజలకు మా సేవలు భవిష్యత్తులో అందకుండా బ్లాక్ చేసేందుకు ఇలాంటి తప్పుడు రిపోర్టులు సాకుగా ఉపయోగపడతాయి. దీనిపై మేము ఆందోళన చెందుతున్నాం. మీ లొకేషన్లను మేము ట్రాక్ చేయం. మీ కార్యకలాపాలకు సంబధించిన లాగ్‌ కూడా మా వద్ద ఉండదు. వ్యక్తిగత మెసేజ్‌లు ఏవీ కూడా ట్రాక్ చేయం.. అలాగే ఏ ప్రభుత్వంతో కూడా మా సమాచారన్ని పంచుకోమని'' తెలిపింది. 

Also Read: బద్దలైన అగ్నిపర్వతం.. వెనక్కి మళ్లిన ఎయిరిండియా విమానం

ఇదిలాఉండగా ఇరాన్‌లో ఇప్పటికే పలు సోషల్ మీడియాలు కొన్నేళ్లుగా బ్లాక్ అయ్యాయి. 2022లో అక్కడి ప్రభుత్వంపై ఆందోళనలు చెలరేగాయి. ఆ సమయంలో కూడా ఇరాన్ ప్రభుత్వం గూగుల్‌ ప్లే, వాట్సాప్‌పై నిషేధం విధించింది. దీంతో చాలామంది వీపీఎన్‌ల సాయంతో వీటిని వాడుకున్నారు. గతేడాది ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. ఇరాన్‌లో ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌, వాట్సాప్‌ను వాడుతుంటారు. అయితే తమ దేశానికి చెందిన అణు శాస్త్రవేత్తలను, సైనిక జనరల్స్‌ను హతమార్చేందుకు వాళ్ల సెల్‌ఫోన్లను ఇజ్రాయెల్ ట్రాక్ చేసిందని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది. ఈ క్రమంలోనే ఆ దేశ ప్రజలను వాట్సాప్‌ డిలీట్‌ చేసుకోవాలని ఇరాన్ ఆదేశించింది. 

Also Read: కాల్పుల విరమణలో మీ పాత్రేమిలేదు..ట్రంప్‌కు ఝలక్‌ ఇచ్చిన మోదీ

Also Read: కాల్పుల విరమణలో మీ పాత్రేమిలేదు..ట్రంప్‌కు ఝలక్‌ ఇచ్చిన మోదీ

Advertisment
Advertisment
తాజా కథనాలు