/rtv/media/media_files/2025/06/13/e4AXNKRABDDUILAIQ894.jpg)
Captain Sumeet Sabharwal
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బయలుదేరిన కాసేపటికే కూలిపోయి 269 మందిని బలి తీసుకుంది. విమానం నడిపై పైలెట్లు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. వీరిలో కెప్టెన్ సుమిత్ సభర్వాల్ గురించి కథనాలు బయటకు వస్తున్నాయి. కెప్టెన్ సుమిత్ సభర్వాల్ కు 8,200 గంటల విమానయాన అనుభవం ఉంది. ఆయన చాలా అనుభవజ్ఞుడైన పైలట్. అయితే సుమిత్ తన ఉద్యోగం మానేయాలని అనుకున్నారని తెలుస్తోంది. సుమిత్ కు 90 ఏళ్ళ తండ్రి ఉన్నారు. ఆయన ముంబైలోని పోవైలో ఒంటరిగా నివసిస్తున్నారు. సుమిత్ తల్లి రెండేళ్ళ క్రితం చనిపోయారు. హిందూస్తాన్ టైమ్స్ వార్తాపత్రికలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ఆయన విమానానికి ముందు తన తండ్రికి - లండన్ చేరుకున్న తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను అని చెప్పారని తెలిసింది. అంతకు ముందు మూడు రోజుల క్రితం సుమిత్ ఆయన తండ్రితో తాను త్వరలో ఉద్యోగం వదిలేసి జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చారని తెలుస్తోంది. కానీ ఇప్పుడు కొడుకూ ఏకంగా చనిపోవడంతో సుమిత్ తండ్రి షాక్ లోకి వెళ్ళిపోయారని చెబుతున్నారు.
ये तस्वीर कैप्टन समित सभरवाल की है
— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) June 12, 2025
दूसरा वीडियो उनके पिता का है
सुमित सभरवाल के 88 वर्षीय पिता मुंबई के पवई इलाके में अकेले रहते हैं।
अब तक बेटा आता रहता था,अब वो भी नहीं आएगा।
कैप्टन सुमीत सब्बरवाल कोई जूनियर नही थे।
कैप्टन सुमीत सब्बरवाल एक LTC थे उनके पास 8200 घंटे का उड़ान… pic.twitter.com/nVkkI4ZUGX
మొదలైన డీఎన్ఏ పరీక్షలు..
ఇక ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించడానికి ఫోరెన్సిక్ డెంటల్ ఐడెంటిఫికేషన్, DNA పరీక్షలు ప్రారంభించారు. మృతదేహాలు అస్సలు గుర్తు లేని పరిస్థితుల్లో ఉండడం వలన పళ్ళు, గోళ్ళు నమూనాల ద్వారా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి ఒకటి లేదా రెండు రోజులు పట్టవచ్చని చెబుతున్నారు. మరోవైపు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతోంది. ఇంజిన్ వైఫల్యం లేదా రెక్కల ఫ్లాప్ పనిచేయకపోవడం ప్రమాదానికి కారణం కావచ్చని చెబుతున్నారు.