/rtv/media/media_files/nbZ5Nk83obg8be8Tzs1W.jpg)
Iran - Israel war
Iran - Israel war : ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం అక్కడి భారతీయులపై పడింది. ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు కనిపించకపోవడం, భయంతో అక్కడ జీవించలేక తమను స్వదేశానికి తీసుకెళ్లండని భారతీయులు ఇండియన్ గవర్నమెంట్ను కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్లోని టెహ్రాన్నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇరాన్ గగనతలం మూసివేసినందున భూ మార్గంలోనే వారిని తరలించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా తొలివిడతగా 100 మందితో కూడిన తొలి బృందం టెహ్రాన్ నుంచి బయల్దేరింది. సోమవారం నాటికి వారు అర్మేనియాకు చేరుకునే అవకాశం ఉంది.
Also Read: దుబాయ్లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
ఇరాన్లో భారతదేశానికి చెందిన పలువురు పౌరులతో పాటు వందలాది విద్యార్థులు వైద్యవిద్య ఇతర అవకాశాల కోసం ఇరాన్కు వలస వెళ్లారు. యుద్ధ నేపథ్యంలో వారంతా బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. దీంతో వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు సహకరించాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనికి స్పందించిన టెహ్రాన్ ప్రస్తుతం గగనతలం మూసివేసినందున.. భూసరిహద్దుల మీదుగా తీసుకెళ్లొచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరాన్లో పదివేల మందికి మించి భారతీయులున్నారు. వారిలో సుమారు 6వేలమందికి పైగా విద్యార్థులే ఉన్నారు. ఇజ్రాయెల్ బాంబు దాడుల నేపథ్యంలో భారతీయ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. దీనితో వారిని ఇండియాకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో భూ సరిహద్దుల మీదుగా ఆర్మేనియా, అజర్బైజాన్, తుర్కమెనిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల గుండా వారిని భారతదేశానికి తీసుకురానున్నారు.
Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?
టెహ్రాన్కు సమీపంలో ఉంటున్న వైద్య విద్యార్థులు రెండు రోజుల క్రితమే భారత ఎంబసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. తమను ఇండియాకు తరలించాలని కోరారు. ఎంబసీ కూడా వారితో సంప్రదింపులు జరిపింది. భారతీయుల భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నామన్న ఎంబసీ అధికారులు.. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. దానికి అనుగుణంగా భారతీయ విద్యార్థుల తరలింపును వేగవంతం చేసింది.
Also Read: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!