/rtv/media/media_files/2025/06/21/israel-claims-killing-of-senior-iranian-commander-in-overnight-strike-in-western-iran-2025-06-21-19-19-16.jpg)
Israel claims killing of senior Iranian commander in overnight strike in western Iran
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇరాన్లోని అణు, సైనిక స్థావరాలు, కీలక నేతలే టార్గెట్గా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని చాలామంది కీలక నేతలు హతమయ్యారు. ఇటీవల పలువురు అణు శాస్త్రవేత్తలు కూడా చనిపోయారు. అయితే తాజాగా ఇరాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్రియారీ హతమయ్యారు. ఈ విషయాన్ని IDF ప్రకటించింది.
Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్
Israel-Iran War
బెహ్నామ్.. ఇరాన్ నుంచి హమాస్, హౌతీ, హెజ్బొల్లా ఇతర సంస్థలకు ఆయుధాలు సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు పేర్కొంది. దీంతో ఇరాన్కు మరో దెబ్బ తగిలినట్లయ్యింది. అయితే శుక్రవారం కూడా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వైమానిక దళం, డ్రోన్ యూనిట్ కమాండర్ సయీద్ ఇజాదితో పాటు ఇతర నేతలు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. 2023లో అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన దాడులకు ప్రణాళికలు రచించింది అతడే అని తెలిపాయి.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
ఇదిలాఉండగా ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇటీవల ఇరాన్లోని అణుస్థావరాలపై కూడా ఐడీఎఫ్ దళాలు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైకి డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగింది. దాదాపు 10 రోజుల నుంచి ఇరుదేశాల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో ఇప్పటిదాకా 400 మందికి పైగా మృతి చెందారు. 3 వేల మందికి పైగా గాయాలపాలయ్యారు.
Also Read: హోటల్లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?
Also Read : బేగంపేటలో భారీ చోరీ..ఏకంగా రూ.48లక్షలు కాజేసి..
iran | israel | israel iran war