/rtv/media/media_files/2025/06/18/FASTag annual pass-7e87ca95.jpg)
FASTag annual pass
FASTag annual pass : జాతీయ రహదారులపై ప్రయాణాన్ని ఈజీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. దీనివల్ల టోల్ఫ్లాజాల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచిఉండాల్సిన అవసరం లేకుండా సమయానికి తమ గమ్యస్థానం చేరడానికి అవకాశం ఏర్పడింది. ఇదిలా ఉండగా తాజాగా కేంద్ర రోడ్డు రవాణా అండ్ హైవేల మంత్రిత్వ శాఖ ఫాస్టాగ్ పై మరోక కీలక ప్రకటన చేసింది.ఆగస్టు 15, 2025 నుంచి వార్షికంగా ఫాస్టాగ్ పాస్ ను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వెల్లడించింది.
Important Announcement 📢
— Nitin Gadkari (@nitin_gadkari) June 18, 2025
🔹In a transformative step towards hassle-free highway travel, we are introducing a FASTag-based Annual Pass priced at ₹3,000, effective from 15th August 2025. Valid for one year from the date of activation or up to 200 trips—whichever comes…
Also Read : కోర్టు ఆగ్రహానికి గురైన కన్నప్ప సినిమా.. సెన్సార్ లేకుండానే విడుదలపై సందేహాలు
కాగా కేంద్రం ప్రకటించిన ఈ వార్షిక పాస్ మూలంగా ప్రజలపై భారం తగ్గడంతో పాటు ప్రయాణం మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన ఎక్స్ పోస్టులో స్పష్టం చేశారు. ఈ పాస్ వేగవంతమైన, సులభతరమైన ప్రయాణాన్ని అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ పాస్ కమర్షియల్ వాహనాలకు వర్తించదని చెప్పారు. ఆగస్టు 15, 2025 నుంచి అమల్లోకి రానున్న ఈ వార్షిక ఫాస్టాగ్ పాస్ కోసం రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. దీనిద్వారా 200 ట్రిప్స్ ప్రయాణించవచ్చని గడ్కరీ వెల్లడించారు.
Also Read: కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..
అయితే ఈ ఫాస్టాగ్ నాన్ కమర్షియల్ వానహాలకు మాత్రమే వర్తిస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దీని కింద జీపులు, కార్లు, వ్యాన్ల యజమానులు తమ ప్రయాణాల కోసం వార్షిక పాస్ సౌకర్యాన్ని తక్కువ ఖర్చులో వినియోగించుకోవచ్చు. దీని వ్యాలిడిటీ కొన్నప్పటి నుంచి ఏడాది లేదా 200 ట్రిప్స్ ఏది ముందుగా పూర్తయితే దానిని రవాణా శాఖ పరిగణలోకి తీసుకుంటుందని గడ్కరీ చెప్పారు. కాగా దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే రాజమార్గ్ యాత్ర యాప్, ఎన్ హెచ్ఏఐ వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొస్తామని గడ్కరీ చెప్పారు. అలాగే 60 కిలోమీటర్ల లోపు టోల్ ప్లాజాలను కలిగి ఇబ్బంది పడుతున్న చాలా మంది వాహనదారులకు ప్రస్తుతం తీసుకొస్తున్న వార్షిక పాస్ మంచి పరిష్కారంగా నిలుస్తుందని గడ్కరీ స్పష్టం చేశారు.
Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !