/rtv/media/media_files/2025/06/19/israel-iran-war-2025-06-19-15-18-49.jpg)
israel iran war
ఇరాన్, ఇజ్రాయెల్ వార్ రోజురోజుకీ ముదురుతోంది. దీంతో ఆ దేశాల నుంచి చమురు దిగుమతులు తగ్గాయి. ఈ క్రమంలో దేశంలో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దేశంలో కేవలం చమురు ధరలు మాత్రమే కాకుండా డ్రై ఫ్రూట్స్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎండుద్రాక్ష, వాల్నట్స్, బాదం, అంజీర్, ఆప్రికాట్లు వంటి డ్రైఫ్రూట్లను దిగుమతి చేసుకుంటుంది.
ఇది కూడా చూడండి: Coriander Seed Water: కొత్తిమీర గింజల నీరు ఒక దివ్యౌషధం. దీని ప్రయోజనాలను తెలుసుకోండి!
ఎక్కువగా ఇరాన్ నుంచి..
ఇరాన్ నుంచి ఖర్జూరం, మమ్రా బాదం, పిస్తాపప్పులు వంటి డ్రైఫ్రూట్లను కూడా దిగుమతి చేసుకుంటుంది. అయితే గతంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ద్వారా భారతదేశానికి డ్రై ఫ్రూట్స్ పంపేది. కానీ ఇటీవల పాకిస్తాన్తో గొడవలు పెరగడంతో ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఇరాన్లోని చాబహార్ ఓడరేవు ద్వారా భారతదేశానికి డ్రై ఫ్రూట్స్ పంపుతుంది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా డ్రై ఫ్రూట్స్ సరఫరా ఆగిపోయింది. దీని కారణంగా ఢిల్లీ హోల్సేల్ మార్కెట్లలో డ్రై ఫ్రూట్స్ ధరలు ఐదు నుంచి పది రెట్లు పెరిగాయి.
ఇది కూడా చూడండి: IND vs ENG : వాళ్లు లేకుండా ఆడటం కష్టమే.. రాహుల్ ఎమోషనల్ కామెంట్స్!
ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న డ్రై ఫ్రూట్స్లో ఎక్కువ భాగం దుబాయ్ ద్వారా భారతదేశానికి రవాణా అవుతున్నాయి. వాస్తవానికి ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు ఉంది. ఇటు నుంచి రవాణా సులభంగా అవుతుందని డ్రై ఫ్రూట్స్ను మొదట ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్కు పంపి, అక్కడి నుండి దుబాయ్తో సహా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. దుబాయ్ ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం. ఇక్కడి వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో గిడ్డంగులను నిర్మించారు.
ఇది కూడా చూడండి: Jagan: 'నేనొస్తే ఆంక్షలెందుకు'.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
వార్ వల్ల ఇరాన్ నుండి డ్రై ఫ్రూట్స్ సరఫరా తగ్గిందని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే నెలల్లో డ్రై ఫ్రూట్స్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. భారతదేశం డ్రై ఫ్రూట్స్, నూనె మాత్రమే కాకుండా ఉప్పు, సల్ఫర్, బంకమట్టి, రాయి, ప్లాస్టర్, సున్నం, సిమెంట్, ఖనిజ ఇంధనాలు, ప్లాస్టిక్, దాని ఉత్పత్తులు, ఇనుము మరియు ఉక్కు, సేంద్రీయ రసాయనాలు, గమ్, రెసిన్, లక్కర్ వంటి ఉత్పత్తులను కూడా ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. వీటిన్నింటిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ధ్వంసమైన బ్లాక్ బాక్స్ విదేశాలకు..?