/rtv/media/media_files/2025/06/19/black-box-2025-06-19-13-57-54.jpg)
ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం ఎలా జరిగిందో తెలియాలంటే బ్లాక్ బాక్స్ చాలా ముఖ్యం. అయితే దర్యాప్తులో కీలకమైన బ్లాక్బాక్స్ ప్రమాదంలో దెబ్బతిన్నట్లు తెలిసింది. దీంతో అందులోని డేటాను విశ్లేషించేందుకు బ్లాక్బాక్స్ను విదేశాలకు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏ-171 విమానం గత గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే రెసిడెంట్ డాక్టర్స్ హాస్టల్ భవనంపై కూలిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత బ్లాక్బాక్సును విమానం కూలిన బిల్డింగ్పై గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు ఈ బ్లాక్ బాక్స్ చాలా కీలకం.
This is so bloody sad to read. India’s data retrieval unit is not equipped to handle damage caused by crash blaze.
— Snehesh Alex Philip (@sneheshphilip) June 19, 2025
Air India Black Box headed to the US. Story by @ari_maj, one handle i follow for my detailed civil aviation updates pic.twitter.com/xvLjn2ZZPd
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బ్లాక్బాక్స్ దెబ్బతిన్నట్లు తెలిసింది. దీంతో అందులోని డేటాను విశ్లేషించేందుకు దెబ్బతిన్న బ్లాక్బాక్స్ను వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ బ్లాక్ బాక్స్ విమానం తోక భాగంలో బ్లాక్బాక్స్ను అమర్చుతారు. ప్రమాదాల్లో పేలుడు ద్వారా ఉత్పన్నమయ్యే మంటల తట్టుకునేలా 1100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గంటపాటు ఉన్నా ధ్వంసం కాకుండా వీటిని రూపొందిస్తారు.