/rtv/media/media_files/2025/06/19/kl-rahul-test-match-eng-2025-06-19-14-24-29.jpg)
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను మిస్ అవుతున్నట్లుగా భారత సీనియర్ బ్యాట్స్మన్ కెఎల్ రాహుల్ వెల్లడించాడు. రేపటినుంచి ఇంగ్లండ్ వేదికగా ఆ జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడబోతుంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన రాహుల్.. అనుభవజ్ఞులైన రోహిత్, కోహ్లీ లేకపోవడం జట్టకు పెద్ద లోటనే అన్నాడు. తన కెరీర్ లో ఇప్పటివరకు వారిద్దరూ లేకుండా ఏ మ్యాచ్ కూడా ఆడలేదన్నారు. తాను ఆడిన 50 టెస్టుల్లో ఎవరో ఒకరు జట్టులో ఉన్నారని తెలిపాడు.
డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లడమంటే
ఇప్పుడు వీరిద్దరూ లేకుండా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లడమంటే కష్టమే అవుతుందని రాహుల్ చెప్పుకొచ్చాడు. గత దశాబ్ద కాలంగా విరాట్, రోహిత్ భారత క్రికెట్కు మూలస్థంభాలుగా ఉన్నారు. భారత క్రికెట్ జట్టుకు వారు చేసిన సేవలకు గానూ గౌరవించాలని తెలిపాడు. మునుపటి కంటే చాలా ఎక్కువ బ్యాటింగ్ బాధ్యతలను మోయాల్సిన బాధ్యత తనపైన ఉందని రాహుల్ వెల్లడించాడు. 2014-15లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ధోని నాయకత్వంలో రాహుల్ టెస్ట్ అరంగేట్రం చేశాడు, కోహ్లీ నాయకత్వంలోనే రాహుల్ టెస్ట్ బ్యాట్స్మన్ గా ఎదిగాడు.
రాహుల్ కు ఇంగ్లాండ్లో ఇది మూడవ టెస్ట్ పర్యటన. ఆతిథ్య జట్టుతో జరిగిన తొమ్మిది టెస్ట్లలో రాహుల్ 34.11 సగటుతో 614 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. మొదటి 100 పరుగులు 2018లో ది ఓవల్లో వచ్చాయి కానీ దురదృష్టవశాత్తు భారత్ ఆ మ్యాచ్లో 130 పరుగుల తేడాతో ఓడిపోయి చివరికి 1-4 తేడాతో సిరీస్ను కోల్పోయింది. మరోవైపు తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ఇప్పటికే ప్రకటించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ టీమ్ .. ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఇద్దరు పేస్ ఆల్రౌండర్లు, ఒకే ఒక స్పిన్నర్, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది.
ఇంగ్లండ్ తుది జట్టు:
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రిడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్