జగన్ కాన్వయ్ వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర వివాదంగా మారింది. దీనిపై తాజాగా జగన్ స్పందిచారు. పరామర్శకు వెళ్తుంటే ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే చంద్రబాబు వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మాజీ సీఎం జగన్ పర్యటన జరిగిన సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వర్ విగ్రహావిష్కరణకు ఆయన హాజరయ్యారు. వాళ్ల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే జగన్ కాన్వయ్ వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర వివాదంగా మారింది. దీనిపై తాజాగా జగన్ స్పందిచారు. పరామర్శకు వెళ్తుంటే ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. '' నేను వస్తుంటే పోలీసులు ఎందుకు బారికేడ్లు ఎందుకు పెట్టారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. పొదిలిలో 40 వేల మంది నా కోసం వచ్చారు. 40 మందితో నా మీద రాళ్లు వేయించాలని చూశారు. వాళ్లు సమన్వయం పాటించారు కాబట్టే 40 వేల మంది 40 మంది మీద పడలేదు.
40 మందితో గొడవ చేయించి కేసులు పెట్టించారు. చంద్రబాబుకు ఎందుకు ఇంత అసహనం ?. రైతులకు సంఘీభావంగా ఎవరూ వెళ్లకూడదా ?. కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోపే వ్యతిరేకత వచ్చింది. ఏ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు. రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రబాబు పాలనలో అసహనం పెరిగింది. ఆయన ప్రజల్లో వ్యతిరేకతను చూస్తున్నారు. ప్రజా సమస్యలు ఎవరైనా గొంతెత్తితే ఆ గొంతు నులిమేస్తున్నారు. మా పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎవరూ గళం విప్పకూడదు, విప్పనివ్వకూడదని అంటున్నారు.
సత్తెన్నపల్లి టూర్ ముందు చెవిరెడ్డి అరెస్టు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే. ఏడాది నుంచి చెవిరెడ్డి పేరు లిక్కర్ లో వినిపించిందా ?. భాస్కర్ను ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. అతని గన్ మెన్ను పిలిచి భాస్కర్ కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అతడిని ఇరికించేందుకు గిరి అనే కానిస్టేబుల్ దగ్గర కూడా తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారు. చెవిరెడ్డి అరెస్టు నిజంగా ఆశ్చర్యకరం. చంద్రబాబు, లోకేష్ గన్మెన్ను పట్టుకుని స్టేట్మెంట్ తీసుకుంటే చాలు. భాస్కర్కు జరిగింది చూస్తే సామాన్యుడు బతకలేడు. సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. రేపొద్దున వ్యవస్థ బతుకుతుందా. నక్సలిజం అనేది ఇలాగే పుడుతుంది
పిన్నెల్లి పైన కూడా తప్పుడు కేసులు పెట్టారు. మాచర్లలో అజమాయిషీ కోసమే అరెస్టులు. దళితుడు నందిగాం సురేష్పై తప్పుడు కేసులు పెట్టారు. సుప్రీం కోర్టుకు కింద మీద పడి వెళ్తేనే బెయిల్ వచ్చింది. వల్లభనేని వంశీకి ఒక కేసులో బెయిల్ వస్తే.. మరో కేసులో అరెస్టు చేస్తారు. కృష్ణమోహన్.. నా ఓఎస్డీ.. ఆయన్ని చూస్తేనే జాలి వేస్తుంది. కాలేజీ టైమ్లో చంద్రబాబును కొట్టిన కోపంతో పెద్దిరెడ్డిని అరెస్టు చేస్తారు. పేర్ని నానిపై తప్పుడు కేసులు పెట్టారు.విజయవాడ గౌతమ్ రెడ్డి అమాయకుడు. ఇలా వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. నా చుట్టూ ఉన్నవాళ్లను భయపెట్టి అరెస్టు చేస్తున్నారు. ప్రలోభాలు పెట్టి స్టేట్మెంట్ తీసుకుని కేసులు పెడుతున్నారు.
70 ఏళ్ల ముసలాయన.. సీనియర్ విలేకరి కొమ్మినేని. ఆయన ఏం పాపం చేశారని జైలుకు పంపారు ?. పానలిస్టు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం. కొమ్మినేని మీద చంద్రబాబుకు కోపం ఎక్కువ. కొమ్మినేని ఉద్యోగం పోవడానికి కూడా చంద్రబాబే కారణం. సాక్షి ఆస్తులు ధ్వంసం చేసేందుకు కుట్ర చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే సాక్షిపై దాడులు చేస్తున్నారు. సుప్రీం కోర్టు విచక్షణ అధికారాలతో కొమ్మినేనికి బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ చంద్రబాబుకు చెంప చెళ్లుమనిపించినట్లే.
సాక్షిపై దాడికి చంద్రబాబు బాధ్యుడు కాదా ?. ఇదే సాంప్రదాయం రేపు కొనసాగితే... ఎవరైనా బతుకుతారా ?. ఈ రోజు సాక్షి.. రేపు ఇతర ఛానళ్లు కావచ్చు. ఇది విచ్చలవిడి రౌడీయిజం. అసలు మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా ?. ఎంతసేపు రెడ్ బుక్ పాలనపైనే దృష్టి పెట్టారు. ఆడవాళ్ల గురించి, గౌరవం గురించి మాట్లాడుతున్నారు. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేశారు జరిగిన రెండు రోజుల తర్వాత సాక్షి దానిని బయటపెట్టింది. ఆ తర్వాతే చంద్రబాబు మేలుకున్నాడు. ఆడవాళ్ల ఆర్థిక ఎదుగుదల కోసం నేను సాయం చేశాను. వాళ్లకి మేలు చేస్తూ నేరుగా డబ్బులిచ్చాను. చట్టం చేసి మరీ వారికి నామినేటెడ్ పదవులిచ్చాం. మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు. వెన్నుపోటు పొడవటంలో ఆయనకు ఆయనే సాటి'' అని జగన్ విమర్శలు చేశారు.
Jagan: 'నేనొస్తే ఆంక్షలెందుకు'.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
జగన్ కాన్వయ్ వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర వివాదంగా మారింది. దీనిపై తాజాగా జగన్ స్పందిచారు. పరామర్శకు వెళ్తుంటే ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే చంద్రబాబు వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
Jagan and chandra babu
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మాజీ సీఎం జగన్ పర్యటన జరిగిన సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వర్ విగ్రహావిష్కరణకు ఆయన హాజరయ్యారు. వాళ్ల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే జగన్ కాన్వయ్ వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర వివాదంగా మారింది. దీనిపై తాజాగా జగన్ స్పందిచారు. పరామర్శకు వెళ్తుంటే ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. '' నేను వస్తుంటే పోలీసులు ఎందుకు బారికేడ్లు ఎందుకు పెట్టారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. పొదిలిలో 40 వేల మంది నా కోసం వచ్చారు. 40 మందితో నా మీద రాళ్లు వేయించాలని చూశారు. వాళ్లు సమన్వయం పాటించారు కాబట్టే 40 వేల మంది 40 మంది మీద పడలేదు.
40 మందితో గొడవ చేయించి కేసులు పెట్టించారు. చంద్రబాబుకు ఎందుకు ఇంత అసహనం ?. రైతులకు సంఘీభావంగా ఎవరూ వెళ్లకూడదా ?. కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోపే వ్యతిరేకత వచ్చింది. ఏ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు. రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రబాబు పాలనలో అసహనం పెరిగింది. ఆయన ప్రజల్లో వ్యతిరేకతను చూస్తున్నారు. ప్రజా సమస్యలు ఎవరైనా గొంతెత్తితే ఆ గొంతు నులిమేస్తున్నారు. మా పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎవరూ గళం విప్పకూడదు, విప్పనివ్వకూడదని అంటున్నారు.
Also Read: DNA టెస్ట్తో 210 డెడ్బాడీలు గుర్తింపు.. 187 మృతదేహాలు అప్పగింత
సత్తెన్నపల్లి టూర్ ముందు చెవిరెడ్డి అరెస్టు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే. ఏడాది నుంచి చెవిరెడ్డి పేరు లిక్కర్ లో వినిపించిందా ?. భాస్కర్ను ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. అతని గన్ మెన్ను పిలిచి భాస్కర్ కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అతడిని ఇరికించేందుకు గిరి అనే కానిస్టేబుల్ దగ్గర కూడా తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారు. చెవిరెడ్డి అరెస్టు నిజంగా ఆశ్చర్యకరం. చంద్రబాబు, లోకేష్ గన్మెన్ను పట్టుకుని స్టేట్మెంట్ తీసుకుంటే చాలు. భాస్కర్కు జరిగింది చూస్తే సామాన్యుడు బతకలేడు. సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. రేపొద్దున వ్యవస్థ బతుకుతుందా. నక్సలిజం అనేది ఇలాగే పుడుతుంది
పిన్నెల్లి పైన కూడా తప్పుడు కేసులు పెట్టారు. మాచర్లలో అజమాయిషీ కోసమే అరెస్టులు. దళితుడు నందిగాం సురేష్పై తప్పుడు కేసులు పెట్టారు. సుప్రీం కోర్టుకు కింద మీద పడి వెళ్తేనే బెయిల్ వచ్చింది. వల్లభనేని వంశీకి ఒక కేసులో బెయిల్ వస్తే.. మరో కేసులో అరెస్టు చేస్తారు. కృష్ణమోహన్.. నా ఓఎస్డీ.. ఆయన్ని చూస్తేనే జాలి వేస్తుంది. కాలేజీ టైమ్లో చంద్రబాబును కొట్టిన కోపంతో పెద్దిరెడ్డిని అరెస్టు చేస్తారు. పేర్ని నానిపై తప్పుడు కేసులు పెట్టారు.విజయవాడ గౌతమ్ రెడ్డి అమాయకుడు. ఇలా వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. నా చుట్టూ ఉన్నవాళ్లను భయపెట్టి అరెస్టు చేస్తున్నారు. ప్రలోభాలు పెట్టి స్టేట్మెంట్ తీసుకుని కేసులు పెడుతున్నారు.
Also Read: మా బాంబులతో ఇరాన్ నేలమట్టం అవుతుంది.. ట్రంప్ సంచలన వార్నింగ్
70 ఏళ్ల ముసలాయన.. సీనియర్ విలేకరి కొమ్మినేని. ఆయన ఏం పాపం చేశారని జైలుకు పంపారు ?. పానలిస్టు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం. కొమ్మినేని మీద చంద్రబాబుకు కోపం ఎక్కువ. కొమ్మినేని ఉద్యోగం పోవడానికి కూడా చంద్రబాబే కారణం.
సాక్షి ఆస్తులు ధ్వంసం చేసేందుకు కుట్ర చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే సాక్షిపై దాడులు చేస్తున్నారు. సుప్రీం కోర్టు విచక్షణ అధికారాలతో కొమ్మినేనికి బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ చంద్రబాబుకు చెంప చెళ్లుమనిపించినట్లే.
సాక్షిపై దాడికి చంద్రబాబు బాధ్యుడు కాదా ?. ఇదే సాంప్రదాయం రేపు కొనసాగితే... ఎవరైనా బతుకుతారా ?. ఈ రోజు సాక్షి.. రేపు ఇతర ఛానళ్లు కావచ్చు. ఇది విచ్చలవిడి రౌడీయిజం. అసలు మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా ?. ఎంతసేపు రెడ్ బుక్ పాలనపైనే దృష్టి పెట్టారు. ఆడవాళ్ల గురించి, గౌరవం గురించి మాట్లాడుతున్నారు. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేశారు
జరిగిన రెండు రోజుల తర్వాత సాక్షి దానిని బయటపెట్టింది. ఆ తర్వాతే చంద్రబాబు మేలుకున్నాడు. ఆడవాళ్ల ఆర్థిక ఎదుగుదల కోసం నేను సాయం చేశాను. వాళ్లకి మేలు చేస్తూ నేరుగా డబ్బులిచ్చాను. చట్టం చేసి మరీ వారికి నామినేటెడ్ పదవులిచ్చాం. మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు. వెన్నుపోటు పొడవటంలో ఆయనకు ఆయనే సాటి'' అని జగన్ విమర్శలు చేశారు.