/rtv/media/media_files/2025/09/12/indian-origin-motel-manager-beheaded-in-us-2025-09-12-09-40-11.jpg)
Indian-Origin Motel Manager Beheaded in US
ఈమధ్య అమెరికా(usa) లో భారత సంతతికి చెందిన వ్యక్తులు అకాల మరణం చెందుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ముష్కరులు కాల్పులు తదితర ఘటనల్లో ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. తాజాగా డాలస్ నగరంలో ఓ మోటల్లో మేనేజర్(Motel Manager) గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్య(50) అతని సహోద్యోగే కత్తితో తల నరికేయడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. మోటల్ మేనేజర్ నాగమల్లయ్య వద్ద మార్టినెజ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు.
Also Read: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి నలుగురు స్పాట్ డెడ్
Indian-Origin Motel Manager Beheaded In US
అయితే బుధవారం మల్లయ్య, మార్టినేజ్ మధ్య ఓ విషయంపై గొడవ జరిగింది. మార్టినెజ్ మోటల్లో గదిని శుభ్రం చేస్తున్నాడు. విరిగిపోయిన వాషింగ్ మెషీన్ను వాడొద్దని నాగమల్లయ్య చెప్పాడు. కానీ ఈ విషయాన్ని అతడు డైరెక్ట్గా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగితో చెప్పించాడు. దీంతో మార్టినెజ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ విషయంలో వీళ్లద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆవేశంతో ఊగిపోయిన మార్టినెజ్ మల్లయ్యను కత్తితో పలుమార్లు పొడిచాడు.
An Indian American, Chandra Nagamallaiah, was beheaded at a Dallas motel on Wednesday in front of his wife and children
— LaughNLogic (@Thodahasle34127) September 12, 2025
Just because he was an Indian, no mainstream media is covering it.
The height of intolerance.
US is not Safe for Asians. https://t.co/F5APRsDxEB
Absolutely shocking ... an Indian motel manager beheaded in front of his wife and child begging for his life in Dallas, Texas. The assailant then chucks his head on the ground. This is the absolute pits !! No one thought the US could be so lawless !! pic.twitter.com/EiiAyR2Bh5
— Swaminathan Sendhil (@theswami) September 12, 2025
Also Read: అధ్యక్షుడు ఒకలా..వాణిజ్య మంత్రి మరొకలా..రష్యా చమురు కొనుగోలు ఆపితేనే చర్చలని ప్రకటన
మల్లయ్య పారిపోయేందుకు ప్రయత్నించినా కూడా వెంటాడి మరి అతడి తల నరికేశాడు మార్టినెజ్. ఆ తర్వాత తలను చెత్తకుప్పలో పడేశాడు. ఆ దాడిని ఆపేందుకు మల్లయ్య కుటింబీకులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి ఈ హత్యపై భారత కాన్సులేట్ కూడా ఎక్స్లో స్పందించింది. ''మల్లయ్య హత్య దిగ్ర్భాంతికి గురిచేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వాళ్లకి సాయం అందించేందుకు రెడీగా ఉన్నామని'' వెల్లడించింది.