Attari-Wagah: వాఘా వద్ద అవస్థలు.. పసిపిల్లలను కనికరించని పాక్ సైన్యం, కన్నీరుపెట్టిస్తున్న దృశ్యాలు!

భారత్, పాక్ వార్ నేపథ్యంలో బార్డర్ వాఘా వద్ద కన్నీటి దృశ్యాలు కలవరపెడుతున్నాయి. పాక్ తిరిగి వెళ్లేందుకు అక్కడి పౌరులు వాఘా చేరుకోగా పాక్ సైన్యం సరిహద్దును మూసివేసింది. దీంతో పసిపిల్లలతో నడిరోడ్డుమీద తీవ్ర అవస్థలు పడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

New Update
attari wagha

India, -Pakistan war effect Tearful scenes at Wagah border

Attari: భారత్, పాక్ వార్ నేపథ్యంలో ఇరుదేశాల బార్డర్ వాఘా వద్ద కన్నీటి దృశ్యాలు కలవరపెడుతున్నాయి. పాక్ తిరిగి వెళ్లేందుకు అక్కడి పౌరులు వాఘా చేరుకోగా పాక్ సైన్యం సరిహద్దును మూసివేసింది. దీంతో పసిపిల్లలతో నడిరోడ్డుమీద తీవ్ర అవస్థలు పడుతున్నారు.  ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

ఈ మేరకు పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లాలనుకునే కుటుంబాలు అటారి -వాఘా సరిహద్దు వద్దకు చేరుకుంటున్నాయి. అయితే ఉదయం 10:00 గంటలకు గేట్లు తెరవాల్సి ఉన్నప్పటికీ పాక్ సైన్యం మూసివేసి ఉంచింది. లోపలికి అనుమతించాలని వేడకున్నా BSF జవాన్లు ఎవరినీ  చెక్ పోస్ట్‌ దాటడానికి అనుమతించలేదు. దీంతో ఆ రోజు ఇరువైపుల నుండి ఎవరూ దాటలేక అక్కడే అవస్థలు పడుతున్నారు.

Also Read: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..

ఇక పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్‌తో ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ అటారి -వాఘా సరిహద్దును మూసివేసింది. ఇది మూసివేయకముందు దాదాపు 1,000వేల మందికి పైగా పాక్ పౌరులు వెళ్లిపోయారు.

Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

 కానీ ఇప్పుడు పాక్ అధికారులు తిరిగి ప్రవేశించడానికి నిరాకరించడంతో ఇంకొందరు ఇక్కడే చిక్కుకుపోయారు.

Also Read: Life Style: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!

 attari wagah border | today telugu today telugu news

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు