యెమెన్‌పై ఆగని అమెరికా దాడులు.. 70 మందికి పైగా మృతి

యెమెన్ రాజధాని సనా తో పాటు పలు నగరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. దాదాపు 50 లక్ష్యాలను ధ్వంసం చేశాయి. శనివారం రాత్రి సనా, హోదైద, అమ్రాన్ నగరాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇప్పటిదాకా 70 మందికి పైగా మృతి చెందారు.

New Update
America attack on Houthis

America attack on Houthis

యెమెన్‌పై అమెరికా యుద్ధ విమానాలతో విరుచుకుపడుతోంది. యెమెన్ రాజధాని సనా తో పాటు వివిధ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అక్కడ దాదాపు 50 లక్ష్యాలను ధ్వంసం చేశాయి. సనా, హోదైద, అమ్రాన్ నగరాలపై బాంబులతో విరుచుకుపడ్డాయి. శనివారం రాత్రి ఈ దాడులు జరిగాయి. తాజాగా జరిగిన దాడుల్లో హోదైదలో ఉన్న పోర్టు, ఎయిర్‌పోర్ట్‌ సైతం ధ్వంసమైందని హూతీలు అంటున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయినట్లు తెలిపారు. 

Also Read: ట్రంప్‌ను తిడుతూ.. వలసదారులకు స్వాగతం అంటున్న అమెరికన్ పౌరులు

కొన్నిరోజుల క్రితం ఎర్రసముద్రంలోని నౌకాశ్రయంపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో 70 మంది చనిపోయారు. మరో 171 మంది గాయపడ్డారు. తమ దాడులు ఆగవని అమెరికా సెంట్రల్‌ కమాండ్ కూడా స్పష్టం చేసింది. హూతీ రెబల్స్‌లపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని ట్రంప్‌ ఆదేశాల మేరకు ఈ దాడులు కొనసాగుతున్నాయి. 

Also Read: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!

ఇటీవల జరిగిన బాంబు దాడులతో ఆయా ప్రాంతాలు భూకంపం వచ్చినట్లు కంపించిపోయిందని స్థానికులు తెలిపారు. కాగా, ‘మీ టైం అయిపోయింది. ఈ రోజు నుంచే మీ దాడులను నిలిపివేయండి. అలా చేయకపోతే ఇంతకుముందెన్నడూ చూడని విధంగా నరకాన్ని చవిచూస్తారు. తమ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోకుంటే ఎప్పుడు చూడని రీతిలో బాంబుల వర్షం కురిపిస్తాం. ప్రపంచంలోని జలమార్గాల్లో అమెరికా వాణిజ్య, నౌకాదళ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రశక్తీ ఆపలేదు’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హౌతీలను హెచ్చరించారు.

Also Read: తెలంగాణ రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ పంపిణీ? ఉడికించి వీడియో పోస్ట్ చేసిన లబ్దిదారుడు!

Also Read: ‘టీం శివంగి’.. రాష్ట్రంలో తొలిసారి రంగంలోకి మహిళా కమాండోల బృందం!

telugu-news | rtv-news | houthis 

Advertisment
Advertisment
తాజా కథనాలు