మసూద్ ఫ్యామిలీ మొత్తం ఖతం.. | India Pak War | Masood Azhar | Hafiz Saeed | Operation Sindoor | RTV
ఆపరేషన్ సింధూలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హతం అయ్యాడా అంటే అవుననే చెబుతున్నారు. ఇండియా టుడే కథనం ప్రకారం భారత ఆర్మీ వదిలిన మిస్సైల్ హఫీజ్ తలదాచుకున్న మురిద్కే లోని మసీదును హిట్ చేసింది. దీంతో ఇందులోనే అతను కచ్చితంగా మరణించి ఉంటాడని అంటున్నారు.
పహల్గాంలో పర్యాటకులపై జరిపిన పాశవిక దాడి వెనక లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ భారీ భద్రత కల్పిస్తోంది. ప్రభుత్వంతో పాటు ఐఎస్ఐ అతనికి హై లెవల్ సెక్యూరిటీని కల్పించినట్లు సమాచారం.