ceasefire: కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన..సీజ్ ఫైర్ స్టార్ట్

కొంతసేపటి వరకూ కాల్పుల విరమణ లేదు ఏం లేదు అన్న ఇరాన్ ఇప్పుడు సడెన్ గా సీజ్ ఫైర్ స్టార్ట్ అయిందని ప్రకటించింది. టెహ్రాన్ అధికారిక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. 

author-image
By Manogna alamuru
New Update
ceasefire

Iran Announces Ceasefire

12 రోజుల యుద్ధానికి తెర పడింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధానికి ముగింపు పలికాయి. సీజ్ ఫైర్ ఒప్పందానికి రెండు దేశాలూ ఒప్పుకున్నాయి అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. కానీ ఆ తరువాత కూడా ఇరాన్ దాడులు చేసింది. అటు అమెరికా ఆర్మీ బేస్ ల మీదనా, ఇటు ఇజ్రాయెల్ పైన కూడా డ్రోన్లు, మిస్సైల్స్ వేసింది. ఈక్రమంలో ఇరాన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ ఒప్పంద మొదలైందని చెప్పింది. ఈమేరకు టెహ్రాన్ అధికారిక మీడియా ప్రకటన విడుదల చేసింది. 

 

ట్రంప్ ప్రాధేయపడ్డారు..

కాల్పుల విరమణ కోసం ట్రంప్ ప్రాధేయ పడ్డారని ఇరాన్ చెబుతోంది. ఖతార్ లోని అమెరికా మిలటరీ స్థావరాలపై దాడులు చేయగానే బలవంతంగా సీజ్ ఫైర్ కు ఒప్పించారని అంది. అయితే అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణ ప్రకటన చేసిన ఆరు గంటల తర్వాత ఇరాన్ దీన్ని ప్రకటించింది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా దీనిపై మరోసారి స్పందించారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దయచేసి దాన్ని ఉల్లంఘించొద్దు అంటూ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాల్పుల విరమణ ప్రక్రియ ఎలా జరిగిందనేది కూడా అందులో రాశారు.  ఇక ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటన ముందు చివరి నిమిషం వరకూ దాడులు చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ అటాక్స్ ఆపేంత వరకూ తాము ఆపేది లేదని టెహ్రాన్ విదేశాంగ మంత్రి చెప్పారు. ఆ తరువాత ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తమ సాయుధ దళాలు చివరివరకు శక్తిమంతమైన పోరాటం కొనసాగించాయని చెబుతూ.. కాల్పుల విరమణకు సిద్ధమేనన్న సంకేతాలిచ్చారు.

 

Also Read: Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..ట్రంప్ ప్రకటనే కారణం

 

#israel #ceasefire #iran #today-latest-news-in-telugu
Advertisment
Advertisment
తాజా కథనాలు