బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. మాజీ ప్రధాని కొడుకే.. మళ్లీ కొత్త ప్రధానిగా!

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ప్రధాని ఖలేదా జియా, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ దంపతుల కుమారుడు తారిఖ్‌ రెహమాన్‌ బంగ్లాదేశ్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 17 ఏళ్ల తర్వాత ఆయన లండన్‌ నుంచి బంగ్లాదేశ్‌కు వచ్చారు.

author-image
By B Aravind
New Update
Bangladesh belongs to Muslims, Hindus, Christians, Tarique Rehman's peace appeal

Bangladesh belongs to Muslims, Hindus, Christians, Tarique Rehman's peace appeal

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ప్రధాని ఖలేదా జియా, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ దంపతుల కుమారుడు తారిఖ్‌ రెహమాన్‌ 17 ఏళ్ల తర్వాత ఆయన లండన్‌ నుంచి బంగ్లాదేశ్‌కు వచ్చారు.తారిఖ్ రెహమాన్‌ ప్రస్తుతం బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ (BNP) తాత్కాలిక ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అఖండ విజయం సాధించారు. ఆయన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ 166 స్థానాలను గెలుచుకుంది. ఇతర స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జమాత్, మిత్రపక్షాలు 52 స్థానాలను గెలుచుకున్నాయి. ఇస్లామి ఆండోలోన్ బంగ్లాదేశ్ ఒక స్థానాన్ని గెలుచుకోగా, ఇతరులు 6 స్థానాలను గెలుచుకున్నారు. తారిఖ్ రెహమాన్‌కు భారత ప్రధాని మోదీ ఎక్స్‌లో శుభాకాంక్షలు  తెలిపారు. 299 నియోజకవర్గాలలో 127 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో దాదాపు సగం మంది 18-37 సంవత్సరాల వయస్సు గలవారు. వీరిలో 4.57 మిలియన్ల మంది మొదటిసారి పోటీ చేస్తున్నారు.

ఎవరీ తారీఖ్ రెహమాన్..

BNP ఛైర్మన్ తారిక్ రెహమాన్ పోటి చేసిన ఢాకా-17, బోగురా-6 రెండు నియోజకవర్గాల్లో గెలిచారు. BNP 181 సీట్లు, జమాత్, మిత్రపక్షాలు- 61 సీట్లు, ఇస్లామీ ఆండోలోన్ బంగ్లాదేశ్- 1 సీట్లు గెలుచుకున్నాయి. 2008లో బంగ్లాదేశ్ నుంచి వెళ్లిపోయిన తారిఖ్‌ రెహమాన్‌ అప్పటినుంచి లండన్‌లోనే ఉంటున్నారు. 17 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉండి తాజాగా స్వదేశానికి వచ్చారు. గురువారం ఢాకాలోని ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా జులై 36 ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతానికి చేరుకున్నారు. బీఎన్‌పీ పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని అందరం కలిసి నిర్మించుకోవాల్సినం సమయం వచ్చిందని అన్నారు. ఈ దేశం కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో ఉన్నవారికి, ముస్లింలు, హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులకు చెందినదని వ్యాఖ్యానించారు. ప్రతి మహిళ, పురుషుడు, పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లి మళ్లీ క్షేమంగా ఇంటికి చేరుకునే సురక్షిత బంగ్లాదేశ్‌గా నిర్మించాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మైనార్టీలో దాడులు జరుగుతన్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

Also Read: బంగ్లాదేశ్‌లో ఎన్నికలు.. షేక్ హసీనా స్థానం నుంచి హిందూ అభ్యర్థి పోటీ

Tarique Rehman's Peace Appeal

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే యూనస్ పాలనలో మైనార్టీలే లక్ష్యంగా ముఖ్యంగా హిందువులపై వరుసగా దాడులు జరగడం కలకలం రేపుతున్నాయి. ఈ హింసాత్మక ఘటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఇటీవల మైనార్టీ గ్రూప్ సభ్యులు ఢాకాలో నిరసనలు చేశారు. తమకు దేశంలో భద్రత లేదని, మమ్మల్ని రక్షించడంలో యూనస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. భారత్‌ కూడా బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసింది. 

Also Read: పాక్‌కు చుక్కలు చూపిస్తున్న ఉగ్రసంస్థ..త్వరలో వైమానిక దళం ఏర్పాటు..

Advertisment
తాజా కథనాలు