/rtv/media/media_files/2025/05/24/rgOqpFsdA74XI6eK3mRe.jpg)
Germany Attack
జర్మనీలోని హాయ్ బర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ పై నిలుచున్న వారిపై ఓ దుండగురాలు ఉన్నపాటుగా విచక్షణారహితంగా కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ముందు ఎనిమది మందికి మాత్రమే గాయాలయ్యాయిఅని వార్తు వచ్చాయి. కానీ తరువాత ఆసంఖ్య 17 మంది గాయపడ్డారని తెలిసింది.
Also Read: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన
దాడికి కారణాలు తెలియలేదు..
అయితే దాడి చేసిన ఆమె ఎవరు, ఎందుకు దాడి చేసిందన్న విషయం మాత్రం తెలియలేదు. జర్మనీ స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను విచారణ చేస్తున్నారు. ఒక్కరే ఈ దాడిలో పాల్గొన్నారని కన్ఫార్మ్ చేశారు. నిందితురాలికి 39 ఏళ్ళని పోలీసులు చెబుతున్నారు.
Also Read: సన్నగా ఉంటే గుండెపోటు వస్తుందా..? ఈ విషయాలను గుర్తుంచుకోండి
దాడి తరువాత రైల్వే స్టేషన్ లో నాలుగు ప్లాట్ ఫామ్ లను మూసేశారు. కొన్ని రైళ్ళు కూడా ఆగిపోయాయి. ఈ మధ్య తరుచుగా జర్మనీలో హింసాత్మక దాడులు జరుగుతున్నాయని...ఇవి తీవ్ర వాదుల పనే అయి ఉంటుందని భద్రతాధికారులు అనుమానం వ్యక్తం చేశారు. లాస్ట్ ఆదివారం నాడు బీలేఫెల్డ్ నగరంలోని ఒక బార్లో జరిగిన కత్తిపోటులో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.
Also Read: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం
today-latest-news-in-telugu | germany attack news | railway-station
Also Read: SRH VS RCB: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన ఎస్ఆర్హెచ్..ఆర్సీబీపై విజయం