Germany: జర్మనీలో రెచ్చిపోయిన దుండుగురాలు..రైల్వే ఫ్లాట్ ఫామ్ లో దాడి..17 మందికి గాయాలు

జర్మనీలోని హామ్‌బర్గ్‌ సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది. అక్కడ రైలు కోసం నిల్చున్న వారిపై ఓ దుండుగురాలు కత్తితో దాడి చేసింది. దీంతో 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

author-image
By Manogna alamuru
New Update
international

Germany Attack

జర్మనీలోని హాయ్ బర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ప్లాట్‌ఫామ్ పై నిలుచున్న వారిపై ఓ దుండగురాలు ఉన్నపాటుగా  విచక్షణారహితంగా కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ముందు ఎనిమది మందికి మాత్రమే గాయాలయ్యాయిఅని వార్తు వచ్చాయి. కానీ తరువాత ఆసంఖ్య 17 మంది గాయపడ్డారని తెలిసింది.

Also Read: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన

దాడికి కారణాలు తెలియలేదు..

అయితే దాడి చేసిన ఆమె ఎవరు, ఎందుకు దాడి చేసిందన్న విషయం మాత్రం తెలియలేదు. జర్మనీ స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను విచారణ చేస్తున్నారు. ఒక్కరే ఈ దాడిలో పాల్గొన్నారని కన్ఫార్మ్ చేశారు.  నిందితురాలికి 39 ఏళ్ళని పోలీసులు చెబుతున్నారు. 

Also Read: సన్నగా ఉంటే గుండెపోటు వస్తుందా..? ఈ విషయాలను గుర్తుంచుకోండి

దాడి తరువాత రైల్వే స్టేషన్ లో నాలుగు ప్లాట్ ఫామ్ లను మూసేశారు. కొన్ని రైళ్ళు కూడా ఆగిపోయాయి. ఈ మధ్య తరుచుగా జర్మనీలో హింసాత్మక దాడులు జరుగుతున్నాయని...ఇవి తీవ్ర వాదుల పనే అయి ఉంటుందని భద్రతాధికారులు అనుమానం వ్యక్తం చేశారు. లాస్ట్ ఆదివారం నాడు బీలేఫెల్డ్ నగరంలోని ఒక బార్‌లో జరిగిన కత్తిపోటులో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.

Also Read: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం

 today-latest-news-in-telugu | germany attack news | railway-station 

Also Read: SRH VS RCB: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన ఎస్ఆర్హెచ్..ఆర్సీబీపై విజయం

 

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు