Asaduddin Owaisi: పాకిస్థాన్‌పై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

భారత్‌ పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలపై దాడి చేస్తే ఆ దేశం ముర్ఖత్వం ప్రదర్శించిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ప్రసుతం బహ్రెయిన్ పర్యటనలో ఉన్న ఆయన పాక్‌ను గ్రే లిస్టులోకి తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు.

New Update
Asaduddun owaisi Sensational Comments on Pakistan

Asaduddun owaisi Sensational Comments on Pakistan

పాకిస్థాన్ మాత్రం ఇక్కడి పరిస్థితులను అస్థిరపరిచేందుకు, దేశంలో హిందువుల, ముస్లింల మధ్య ద్వేషాన్ని పెంచడం కోసం యత్నిస్తోంది. ఉగ్రవాదులు పాక్ నుంచే వస్తున్నారు. ఆ దేశాన్ని గ్రే లిస్టులోని తీసుకురావాలని కోరుతున్నాం. 2026-27 లో బహ్రెయిన్‌ భద్రతా మండలిలో సభ్యురాలు కానుంది. అందుకే ఆ కోణం నుంచి చూసినా పాక్ గురించి బహ్రెయిన్ ప్రభుత్వానికి వివరించడం మంచిదే. ఈరోజు సమావేశంలో భారత్‌ తరఫున మా వాదనలు వినిపించాం. 

Also Read: నీ అక్రమ సంబంధం సీక్రెట్ నీ భార్యకు చెబుతా.. ఇంజనీర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన AI!

Also Read :  మధ్యప్రదేశ్‌లో దారుణం.. గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం

Asaduddin Owaisi Comments On Pakistan

పాక్ నుంచి సాయం పొందిన ఉగ్రవాదుల ఇండియాలో దాడులు చేస్తున్నారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దాడులకు సంబంధించి పూర్తి డేటా ఇచ్చాం. ముంబై పేలుళ్లు, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ముందు సూసైట్‌ దాడి, పుల్వామా, పఠాన్‌కోఠ్‌ దాడి గురించి వివరించామని'' అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. 

Also Read: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

పాకిస్తాన్ తీరుపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ నిప్పులు చెరిగారు. నాలుగు అంశాలు హైలెట్ చేస్తూ హరీశ్ పాకిస్తాన్‌ని ఐక్యరాజ్యసమితిలో నిలదీశారు. పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆయన చెప్పారు. టెర్రరిజానికి పాకిస్తాన్ వరల్డ్ సెంటర్‌గా ఉందని ఆరోపించారు. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందం నిలిపివేయబడినందున పాకిస్తాన్ తప్పుడు సమాచారం చేస్తోందని శనివారం UNOలో మాట్లాడారు. పాకిస్తాన్ ప్రతినిధి ఐక్యరాజ్యసమితిలో ఒప్పంద అంశాన్ని లేవనెత్తారు. దానికి సమాధానంగా నీరు ప్రాణం, యుద్ధ ఆయుధం కాదని ఆయన స్పందించారు.

Also Read :  మేడ్చల్‌లో విషాదం.. కరెంట్ వైర్ ప్రమాదంలో యువతి మృతి, మరో వ్యక్తి ఆత్మహత్య

telugu-news | rtv-news | pakistan | Terrorist Attack | operation Sindoor | asaduddin-owaisi 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు