Plane Crash: దక్షిణ కొరియాలో మరో విమానానికి తప్పిన పెను ప్రమాదం

ద.కొరియాలో మరో విమానానికి పెను ప్రమాదం తప్పింది. గింపో ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య వచ్చింది. దీంతో పైలట్ మళ్లీ ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

New Update
Flight Accident

Flight Accident

దక్షిణ కొరియాలో ముయాన్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రయాణికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటన మరువకముందే మరో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ విమానం కూడా జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందినదే కావడం కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ విమానం సోమవారం ఉదయం సియోల్‌లోని గింపో ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయ్యింది. 

Also Read: నాకూ తగ్గించాలనే ఉంది..పన్ను మినహాయింపుపై నిర్మలా సీతారామన్

అయితే టేకాఫ్ అయిన కాసేపటికే ఆ విమానంలో టెక్నికల్ సమస్య వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని పైలట్ గుర్తించాడు. దీంతో విమానాన్ని మళ్లీ గింపో ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ విమానానికి కూడా ల్యాండింగ్ గేర్‌ సమస్య వచ్చినట్లు సమాచారం. పైలట్ ముందుగా అప్రమత్తం కాకపోయి ఉంటే మరో ప్రమాదం జరిగేది. ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందులో ఉన్న ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Also read: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్, ప్రయోగం వాయిదా.. ఇస్రో కీలక ప్రకటన

ఇదిలాఉండగా.. ఆదివారం థాయ్‌ల్యాండ్ నుంచి వస్తున్న విమానం సౌత్ కొరియాలో మయాన్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా క్రాష్ అయిన సంగతి తెలిసిందే. ఆ విమానంలో 181 మంది ఉండగా 179 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఇద్దరు సిబ్బంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అయితే జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో సామాన్యులకు కూడా ప్రయాణించేందుకు అందుబాటులో ధరలు ఉంటాయనే గుర్తింపు కూడా ఉంది.  

Also Read: అర్చకులకు నెలకు రూ.18 వేలు.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన

Also Read: షాకింగ్ న్యూస్.. స్టేడియంలో 15 అడుగుల ఎత్తుపై నుంచి పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే!

Advertisment
తాజా కథనాలు