/rtv/media/media_files/2025/05/09/Ir0jjDPLQAmXVBNZAzRm.jpg)
BAL Attacked On Pak Army
పాకిస్థాన్ సైన్యాన్ని బలూచిస్తాన్ నుంచి తరిమికొట్టామని, క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. ఒకవైపు భారత్ , పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. లోహోర్, ఇస్లామాబాద్, రావల్పిండితో పాటు పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో భారత్ దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బీఎఎల్ కూడా దాడులు మొదలు పెట్టడం పాకిస్తాన్ కు తలనొప్పిగా మారింది.
Also Read : యుద్ధ సమయంలో పౌరులు ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? ముఖ్యమైన 10 అంశాలు
Also Read : అప్పు ఇచ్చి ఆదుకోండి ప్లీజ్.. మిత్ర దేశాల వద్ద మోకరిల్లిన పాక్!
దెబ్బకు పాక్ ఆర్మీ పరుగులు..
బలూచిస్థాన్లోని క్వెట్టాలో అక్కడి ఆర్మీ రంగంలోకి దిగింది. క్వెట్టాలోని పాకిస్థాన్ దళాల ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. బలూచి తిరుగుబాటుదారులు క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నారని, పాకిస్థాన్ సైన్యాన్ని అక్కడ నుంచి తరిమేశారని తెలుస్తోంది. క్వెట్టా లోని జంగ్లే బాగ్లోని కాంబ్రానీ లో పాకిస్థాన్ ఆర్మీ కెప్టెన్ సఫర్ ఖాన్ చెక్ పోస్ట్పై దాడి చేశారు. ఆ తరువాత అక్కడే దగ్గరలో ఉన్న ఆరు ప్రాంతాల్లో ఒకేసరి పేలుళ్లను జరిపింది. జమరాన్ కట్గాన్ ప్రాంతంలోని పాకిస్థాన్ ఆక్రమణ దళాల చెక్పాయింట్పై బీఎల్ఏ ఆర్మీ ఆటోమేటిక్ ఆయుధాలతో దాడి చేసింది. అలాగే పాక్ లోని చమురు క్షేత్రాలపై బలూచీలు దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్ సైనికులతో పాటూ చాలామంది సాధారణ ప్రజలు కూడ చనిపోయారని తెలుస్తోంది. దాంతో పాటూ పాకిస్తాన్ సైన్యం క్వెట్టా నుంచి పారిపోయిందని చెబుతున్నారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ పై భారత్ చేస్తున్న దాడులను బలూచిస్తాన్ ఆర్మీ మద్దతునిస్తోంది. భారత్ కు తాము ఫుల్ సపోర్ట్ అంటూ అక్కడి రేడియోల్లో ప్రసారం చేస్తున్నారు.
Also Read : ఐపీఎల్ రద్దు అవుతుందా?: BCCI సంచలన ప్రకటన!
Also Read : పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ?.. అరెస్ట్ అయ్యాడా? పారి పోయాడా?
today-latest-news-in-telugu | pakistan | balochistan