IPL 2025 CANCEL: ఐపీఎల్ రద్దు అవుతుందా?: BCCI సంచలన ప్రకటన!

ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నిన్న రద్దైంది. దీనిపై BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా రియాక్ట్ అయ్యారు. భారతీయ, విదేశీ ఆటగాళ్లు, ప్రేక్షకులు, సహాయక సిబ్బంది భద్రతే ముఖ్యమన్నారు. ధర్మశాలలో మ్యాచ్ ఆందోళన కలిగించడంతో రద్దు చేశామని తెలిపారు.

New Update
ind pak war BCCI secretary devajit saikia issues statement

ind pak war BCCI secretary devajit saikia issues statement

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మ్యాచ్ రద్దయింది. నిన్న (గురువారం) పంజాబ్‌లోని ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు. అనంతరం స్టేడియంలో ఉన్న క్రికెట్‌ ప్రియులను వెంటనే ఖాళీ చేయించారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు స్టేడియాన్ని ఖాళీ చేశారు. 

Also Read :  ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దు

భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా.. IPL టోర్నమెంట్‌లోని మిగిలిన మ్యాచ్‌లు జరుగుతాయా? లేదా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయానికి సంబంధించి బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా సంచలన ప్రకటన రిలీజ్ చేశారు. ముఖ్యంగా మే 8న (గురువారం) పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేయడం గురించి ఆయన మాట్లాడారు. 

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

అందరి భద్రతే మాకు ముఖ్యం

అన్నీ దృష్టిలో ఉంచుకుని, పంజాబ్ VS ఢిల్లీ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాం అని అన్నారు. భారతీయ, విదేశీ ఆటగాళ్లు, ప్రేక్షకులు, సహాయక సిబ్బంది భద్రతే ముఖ్యమని.. దేశ ప్రయోజనాలకు సంబంధించి ఏదైనా చేస్తామని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మొత్తం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని.. దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. 

ఇది కూడా చూడండి: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

అంతేకాకుండా నిన్నటి మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేయడంతో ఎమర్జెన్సీమీటింగ్ జరిగిందని అంతా ప్రచారం జరిగింది. దీనిపై ఆయన రియాక్ట్ అయ్యారు. అత్యవసర సమావేశం జరగడం లేదని.. తామంతా వేర్వేరు ప్రదేశాలలో ఉన్నామని అన్నారు. ధర్మశాల మ్యాచ్ మాత్రమే ఆందోళన కలిగించడంతో దానిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నాము అని చెప్పుకొచ్చారు. దయచేసి రూమర్స్‌ను వ్యాప్తి చేయకుండా ఉండండి అంటూ ఆయన పేర్కొన్నారు. 

 ఇది కూడా చూడండి: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

దీనిపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. తమ ముందున్న పరిస్థితి నిరంతరం మారుతూ ఉంటుందని.. ప్రభుత్వం తమకు ఎలాంటి సూచనలు జారీ చేయలేదని అన్నారు. భవిష్యత్తులో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే.. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకున్న తర్వాతే తీసుకోబడుతుందని తెలిపారు. ఇక ఇవాళ (శుక్రవారం) జరగనున్న మ్యాచ్ ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం జరుగనుంది.

IPL 2025 CANCEL | IPL 2025 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు