/rtv/media/media_files/2025/05/09/jEizU1rRN9JPSrfHLUzl.jpg)
Pakistan Army Chief Asim Munir
భారత్ దెబ్బకు పాకిస్తాన్ ఛిన్నాభిన్నం అయిపోయింది. ఇండియన్ ఆర్మీ వరుసపెట్టి చేస్తున్న దాడులకు పాకిస్తాన్ ప్రభుత్వం తట్టా బుట్టా సర్దుకుని పారిపోతున్నారు. పాక్ ప్రధాని ఇతర ఆర్మీ అధికారులతో కలిసి బహ్రెయిన్ పారిపోతున్నట్లు సమాచారం అందుతోంది. నిన్న భారత ఆర్మీ వేసిన బాంబుల్లో ఒకటి ఆయన ఇంటికి దగ్గరలోనే పడడంతో బతికుంటే బలుసాకైనా తినొచ్చనే ఉద్దేశంతో దేశం విడిచి వెళ్ళిపోతున్నారని తెలుస్తోంది. దీంతో పాకిస్థాన్ లో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
పాక్ ఆర్మీ ఛీఫ్ అరెస్ట్?
ఇక మరోవైపు ఈ మొత్తం మారణకాండకు అసలు కారణమైన పాక్ ఆర్మీ ఛీఫ్ ఆసీమ్ మునీర్ నోటి దూలకు తగిన శిక్ష పడిందని తెలుస్తోంది. సొంత దేశమే ఆయనను అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ ఆర్మీనే ఆసిమ్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఆసిమ్ ను అరెస్ట్ చేసి తరలిస్తున్న దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఆసిమ్ మునీర్ స్థానంలో కొత్త పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ గా జనరల్ షాహిర్ శంషాద్ మీర్జా బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. పహల్గాంలో దాడి జరగడానికి, అది కాస్తా పెద్ది అయి యుద్ధం వరకు దారి తీయడానికి ఆసిమ్ మునీర్ కారణం. మొదటి నుంచి భారత్ పై పాక్ ఆర్మీ ఛీఫ్ నోటికచ్చింది మాట్లాడ్డమే కాక..కాశ్మీర్ మాది..అది ఎప్పటికైనా పాకిస్తాన్ లో కలవాల్సిందే అంటూ ఉగ్రవాదులను ప్రేరేపించారు.
after the arrest of pakistan army chief asim munir, PM shehbaz sharif has also been taken into custody. the country is now under president’s rule, led by asif ali zardari.
— desi sigma (@desisigma) May 8, 2025
pakistan in chaos. power has shifted. pic.twitter.com/yrICMD9ViK
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్.. పాకిస్థాన్ లోని లాహోర్, సియోల్ కోట్, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరాలపై అటాక్ చేస్తోంది. పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేస్తోంది. మరోవైపు పాకిస్థాన్ జమ్మూ ఇతర ప్రాంతాలపై హమాస్ తరహా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. అయితే భారత వాయు సేన పాక్ ప్రయోగించిన దాదాపు 8 క్షిపణులు, డ్రోన్లను కూల్చేసింది.
today-latest-news-in-telugu | pak army chief asim munir