IND-PAK WAR : యుద్ధ సమయంలో పౌరులు ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? ముఖ్యమైన 10 అంశాలు

దేశంలో ప్రస్తుతం యుద్ధవాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో పౌరులుగా మన విధులెంటో తెలుసుకోవాలి. దేశభద్రతకు సంబంధించిన విషయాలను బయటకు చెప్పకూడదు. మనకు తెలిసిన రహస్యాలను కూడా మనస్సులో ఉంచుకోవాలి. యుద్ధ సమయంలో ఇవి చాలా ముఖ్యమైనవి.

New Update

IND-PAK WAR : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ పాక్‌ లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. దీంతో రెచ్చిపోయిన పాక్‌ సైన్యాలు భారత్‌ లోని సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్లతో దాడికి దిగారు. దీనికి ప్రతీగా భారత్‌ పాక్‌ పై విరుచుకుపడింది. పాక్‌ డ్రోన్లను కూల్చివేయడంతో పాటు భారత్‌ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను మట్టుబెట్టింది. మరోవైపు  రెండు దేశాల మధ్య యుద్దం కొనసాగుతూనే ఉంది. దేశంలో పలు ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని పాక్‌ దాడులు చేస్తూనే ఉంది.  వాటిని తిప్పికొడుతూనే పాక్‌లోని ముఖ్యమైన ప్రాంతాలపై భారత్‌ దాడులు చేస్తోంది. 

Also Read: హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!

దేశంలో ప్రస్తుతం యుద్ధవాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో పౌరులుగా మన విధులెంటో తెలుసుకోవాలి.  ఈ విషయంలో  బీహార్,-జార్ఖండ్‌లోని కొన్ని నగరాలకు హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. భారత రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులను ఇచ్చినట్లే, మనం కొన్ని ముఖ్యమైన విషయాలను అందులోనూ దేశభద్రతకు సంబంధించిన విషయాలను బయటకు చెప్పకూడదు. మనకు తెలిసిన రహస్యాలను కూడా మనస్సులో ఉంచుకోవాలి. యుద్ధ సమయంలో ఇవి చాలా ముఖ్యమైనవి. యుద్ధ సమయంలో  దేశ పౌరులమైన మనం ఈ సమయంలో ఏం చేయాలి. ఏం చేయకూడదో తెలుసుకుందాం.  

Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!
 
1. యుద్ధ సమయంలో పౌరులందరూ ప్రభుత్వం లేదా సైన్యం ఇచ్చే ఆదేశాలను  తప్పక పాటించాలి. 
2. యుద్ధ సమయంలో, ప్రభుత్వం లేదా విశ్వసనీయ వార్తా వనరుల నుండి మాత్రమే సమాచారాన్ని పొందాలి
3. మనం ఏదైనా ప్రయాణంలో ఉన్నపుడు మనల్ని తనిఖీ చేసే అధికారం  భద్రతా సిబ్బందికి ఉంది కనుక సహకరించాలి.
4. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో తగ్గిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి
5. యుద్ధం జరుగుతున్న సమయంలో ఎవరైనా భయానికి గురైతే వారికి ధైర్యం చెప్పాలి.  పరిస్థితి గురించి సరైన సమాచారం ఇవ్వాలి.
6. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం, సైన్యం ఇచ్చే ఆదేశాలను ఉల్లంఘించరాదు. అలా చేస్తే పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.
7. యుద్ధ సమయంలో మంచి పౌరుడిలా నియమాలను పాటించాలి. సైన్యంపై ఏదేని పుకార్లు వ్యాప్తి చేయకుండా ఉండాలి.
8. యుద్ధ సమయంలో శత్రు దేశాన్ని ప్రశంసించే ప్రయత్నం చేయరాదు. అలా చేస్తే  అది రాజద్రోహంగా పరిగణించబడుతుంది. 
9. ముఖ్యంగా యుద్ధం గురించిన భయాందోళనలను వ్యాప్తి చేయకూడదు, పరిపాలన సూచనలను అనుసరించాలి.
10.  సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా మన దేశ సైన్య కదలిక,భద్రతా ప్రణాళికల గురించి సమాచారాన్ని పంచుకోకూడదు.

ఈ పది నియమాలు ప్రతి పౌరుడు తూ.చ. తప్పకుండా పాటించాలి. లేనట్లయితే ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు