America: నరకం లాంటి జైల్లో వలసదారుల్ని వేస్తాం: ట్రంప్‌!

అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కఠినంగా వ్యవహరిస్తున్నాడు.అక్రమ వలసదారులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు అయిన గ్వాంటనామో బేలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.

New Update
Trump

America President Trump

వారం రోజుల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) రోజురోజుకి కఠినంగా మారుతున్నారు.అక్రమ వలసదారులపై ఆయన మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శాంతించేలా కనిపించడం లేదు. అలాగే ఈ విషయాన్ని ఇప్పట్లో శాంతించాలని కూడా కోరుకోవడం లేదు. అందుకే ఆయన అక్రమ వలసదారులకు సంబంధించి వివిధ రకాల ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:  UPI Payments: ఫిబ్రవరి 1 నుంచి యూపీఐ పేమెంట్స్ చేయలేరు!

ఇదిలా ఉండగా అక్రమ వలసదారులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు అయిన గ్వాంటనామో బేలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. 9/11 దాడుల తర్వాత ఈ జైలును ఉగ్రవాద అనుమానితులను ఉంచడానికి ఉపయోగించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ జైలును నరకం అని పిలుస్తారు. దీని కారణంగా అమెరికా చాలాసార్లు విమర్శలను ఎదుర్కోన్న సంగతి తెలిసిందే. గ్వాంటనామో బేలో 30,000 మంది వలసదారులను ఉంచేందుకు పెంటగాన్ , హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖను అనుమతించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తున్నట్లు ట్రంప్ వైట్ హౌస్‌లో చెప్పారు.

Also Read: Horoscope Today: నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది..మీదేనేమో చూసుకోండి మరి!

ఈ చర్య అక్రమ వలసదారులను పట్టుకునే మా సామర్థ్యాన్ని వెంటనే రెట్టింపు చేస్తుంది. ఈ సమయంలో ట్రంప్ వైట్ హౌస్‌లో హత్యకు గురైన 22 ఏళ్ల అమెరికన్ నర్సింగ్ విద్యార్థిని లేకన్ రిలే తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడారు. ఈ విద్యార్థి పేరు కొత్త వలస నేరాల బిల్లు చట్టంలో చేర్చడం జరిగింది. లేకెన్ జ్ఞాపకాలను మన హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుకుంటామని ట్రంప్ అన్నారు. నేటి చర్యతో తన పేరు మన దేశ చట్టంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన చట్టమని ట్రంప్ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా చాలా జైళ్లు ఉన్నాయి, వాటికి భిన్నమైన కథలు ఉన్నాయి. కానీ అమెరికా (America) లోని గ్వాంటనామో బే జైలును ప్రపంచంలోని నరకం అని పిలుస్తారనే విషయం తెలిసిందే. ఈ జైలును అమెరికా క్యూబాలో నిర్మించారు. ఈ జైలు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి చేరుకునే ఖైదీలను ఎటువంటి వినికిడి లేకుండా చాలా కాలం పాటు ఉంచుతారు. ఎందుకంటే ఈ జైలు ఉగ్రవాదులను, వారి అనుమానితులను ఉంచడానికి నిర్మించారు. ఈ జైలులో శారీరక హింసతో పాటు, మానసిక హింస కూడా అనుభవిస్తారు. ఖైదీలను చాలా రోజులు నిద్రపోవడానికి అనుమతించరు. దీంతో పాటు కటిక చీకటిలో ఉంచుతారు. సూర్యకాంతి కూడా చేరని చోట ఉంచుతారు. ఈ జైలు గదులు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి.

ఈ జైలు ఎప్పుడు నిర్మించారంటే!

ఈ జైలు 1903 లో స్థాపించడం జరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దీనిని మూసేసే విధానం గురించి మాట్లాడారు. ఈ జైలు విషయంలో అమెరికాను ప్రపంచవ్యాప్తంగా విమర్శించారు. ఈ జైలు 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ప్రారంచారు. ఆ తరువాత ఉగ్రవాద సంబంధిత సంఘటనలలో పాల్గొన్న వారిని మాత్రమే ఇక్కడ ఉంచుతున్నారు.

Also Read: Himachal Pradesh: పెళ్లి కోసం ఆరాటంగా వెళ్లిన వరుడు..తీరా అక్కడ ట్విస్ట్‌ మామూలుగా లేదుగా!

Also Read: DeepSeek: ప్లే స్టోర్ లో డీప్‌ సీక్‌ దూకుడు..కానీ ఆ ప్రశ్నలకు మాత్రం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు