/rtv/media/media_files/2025/05/15/m1ZKQOvm8KkDhzQ9bWhd.jpg)
54 people killed in Gaza by Israel overnight airstrikes on southern Gaza city
ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇవి తాజాగా మరింత ముదిరాయి. గాజాపై ఇజ్రాయెల్ వరుస దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్పై అర్ధరాత్రి వైమానిక దాడులకు దిగింది. 10 నిమిషాల పాటు ఈ దాడులు చేసింది. ఈ ఘటనలో ఏకంగా 54 మంది పౌరులు మృతి చెందారు. వందలాది మంది గాయాలపాలయ్యారు.
Also Read: పాకిస్థాన్ దొంగబుద్ధి.. మిత్రదేశాలతో కలిసి భారత్పై సైబర్ అటాక్
Also Read : సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము 14 ప్రశ్నలు.. సంచలన లేఖ!
Israel - Gaza Airstrikes
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఉత్తర, దక్షిణ గాజాపై బుధవారం జరిగిన వైమానిక దాడుల్లో 70 మంది మృతి చెందారు. అందులో 22 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇదిలాఉండగా ఇటీవల అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఇజ్రాయెల్లో ఉన్న అమెరికాకు చెందిన ఓ బందీని హమాస్ విడుదల చేసింది.
ప్రస్తుతం ట్రంప్ పశ్చిమాసియాలో పర్యటనలో ఉన్నారు. ఈ తరుణంలో ఇజ్రాయెల్ గాజాపై మళ్లీ విరుచుకుపడం చర్చనీయాంశమవుతోంది. ఇదిలాఉండగా ఇటీవల గాజాతో జరిగిన యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడారు. గాజాలో తమ యుద్ధాన్ని ఆపేందుకు ఎలాంటి మార్గం లేదని తెలిపారు. అలా ఆయన చెప్పడంతో గాజాపై కాల్పుల విరమణ ఆశలు సన్నగిల్లాయి.
Also Read: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్నాథ్ సింగ్
Also Read : India-Pak War: ఇకపై 'స్పాటిఫై' లో ఆ పాటలు ఉండవు..!
మరోవైపు హూతీలు తమపై దాడులు జరపడాన్ని నెతన్యాహు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. హూతీలను కచ్చితంగా ఎదుర్కొంటామన్నారు. గతంలో ఏడీఎఫ్ చేసిన దాడులు గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఈసారి దాడులు మాములుగా ఉండవని.. బాంబు మోతలే ఉంటాయంటూ హెచ్చరించారు.
telugu-news | rtv-news | national-news | israel | hamas