Crime News: కొంపముంచిన ప్రేమ వివాహం.. సుఖం కోసం సుపారీ ఇచ్చి భర్తను లేపేసిన భార్య!

బెంగళూరులో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను హతమార్చింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని సుపారి ఇచ్చి మరీ లేపేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి భార్యతో పాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు.

New Update
woman killed her husband for Illegal relationship in bangalore (1)

నిమిషాల సుఖం కోసం కొందరు భార్యలు కట్టుకున్న భర్తలనే కడతేరుస్తున్నారు. ఎన్నో ఏళ్లు సుఖంగా, ఆనందంగా పిల్లా పాపలతో కలిసి జీవించిన కుటుంబాల్లో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. కొందరు ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కాటికి పంపిస్తున్నారు. తాజాగా అలాంటి దారుణమైన సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. 

Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట కొన్నాల్లు హ్యాపీ లైఫ్ లీడ్ చేసింది. వారికి సంతానం కూడా కలిగింది. కానీ భార్యకు చెడుబుద్ది పుట్టింది. వేరొక వ్యక్తితో సన్నిహితం పెరిగి అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇలా ప్రియుడి మోజులో పడి ఆ భార్య ఏకంగా కట్టుకున్న భర్తనే సుపారీ ఇచ్చి చంపించింది. చివరికి ఏమీ ఎరుగనట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.  

Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!

కట్టుకున్న భర్తనే హతమార్చి

బెంగళూరులోని చికక్కమంగళూరు జిల్లా ఎన్‌ఆర్‌పుర తాలూకా కరగుందలో సుదర్శన్ (35), కమల దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కమలకు ఇటీవల శివరాజ్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో ప్రియుడి మోజులో పడి కమల షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 

Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!

తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను లేపేయాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే భర్త సుదర్శన్‌ను హతమార్చేందుకు సుపారీ ఇచ్చింది. దీంతో సుదర్శన్‌ను స్నేహితులు విందుకు తీసుకెళ్లి మద్యంలో నిద్రమాత్రలు కలిపారు. అది తాగిన సుదర్శన్ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతడి గొంతు నులిమి హత్య చేసి కరగుంద బస్టాండ్‌లో డెడ్ బాడీని పడేశారు. 

Also Read: మావోయిస్టుల అంత్యక్రియలు పూర్తి.. అక్కడే దహనం చేసిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు!

అనంతరం భార్య కమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్య సుదర్శన్‌ను ఎవరో హత్య చేశారని.. తమకు ఎవరితోనూ గొడవలు లేవని నమ్మించే ప్రయత్నం చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విభిన్న కోణాల్లో విచారణ చేపట్టారు. అనంతరం కమల ప్రియుడు శివరాజ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. దీంతో కమల, శివరాజ్‌తో పాటు అతడి ఫ్రెండ్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

crime news | wife murder husband news | Latest crime news | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు