/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T112425.279.jpg)
crime
Telangana: తెలంగాణలోని ములుగు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వరరావు(46) అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత నెల 23వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పరిస్థితి విషమించడంతో నేడు చికిత్స తీసుకుంటూ బుధవారం రాత్రి మృతి చెందారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన పథకాల్లో లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేవనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.
ఇది కూడా చూడండి: Delhi BJP : ఢిల్లీలో బీజేపీ గెలిస్తే సీఎం అయ్యేది ఎవరు?... లిస్టులో ఉన్నది వీళ్లే!
పథకాల్లో తన పేర్లు లేవని..
తన పేరుతో పాటు ఇతరుల పేర్లు కూడా లేవని, కనీసం తన చావుతో అయితే అందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుట్టాయిగూడెం ప్రజాపాలన గ్రామసభ జరుగుతుండగానే నాగేశ్వరరావు పురుగుల మందు తాగారు. వెంటనే స్థానికులు నాగేశ్వరావుని ఆసుపత్రికి తరలించారు. దాదాపుగా పది రోజుల నుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధితుడికి భార్య, ఇద్దరూ కుమార్తెలు కూడా ఉన్నారు.
ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్ గ్యాప్ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?
ఇదిలా ఉండగా ఇటీవల ట్రాన్స్జెండర్ ను ప్రేమించిన ఓ యువకుడు కూడా రెండు రోజుల కిందట తన తండ్రి సమాధి వద్ద పురుగుల మందు తాగి, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. చింతలపేటకు చెందిన నవీన్ (25) అదే కాలనీలో ఉండే ట్రాన్స్జెండర్ ను ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఏమైందో తెలియదు కానీ రెండు రోజుల కింద కాలనీ సమీపంలోని స్మశాన వాటికలో తన తండ్రి సమాధి దగ్గర పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.అక్కడ నవీన్ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం చనిపోయాడు.
ఇది కూడా చూడండి: అంతా సర్వనాశనం అయిపోయింది..అక్రమవలదారులుగా వచ్చిన భారతీయుల ఆవేదన
ఇది కూడా చూడండి: America Eggs: అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా రూ.35 లక్షల విలువ గల గుడ్లు దొంగతనం!