America Eggs: అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా రూ.35 లక్షల విలువ గల గుడ్లు దొంగతనం!

అమెరికాలో కోడి గుడ్లను దొంగలు ఎత్తుకుపోతున్నారు. అది కూడా ఒకటో రెండో గుడ్లు కాదు.. ఏకంగా లక్ష గుడ్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. ప్రస్తుతం అమెరికాలో గుడ్ల కొరత అక్కడి వారిని వేధిస్తుండగా.. దొంగలు లక్ష గుడ్లు చోరీ చేశారు.

New Update
eggs

eggs

అమెరికాలో ప్రస్తుతం కోడి గుడ్ల కొరత ఏర్పడింది.దీంతో కోడి గుడ్లను కొనేందుకు అమెరికన్లు భారీగా ఎగబడుతున్నారు. దీంతో కోడి గుడ్ల ధరలు చుక్కలను తాకుతున్నాయి. అయితే ఉత్పత్తి తక్కువ కావడం.. డిమాండ్ పెరిగిపోవడంతో.. గుడ్ల ధరలు భారీగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది.మరోవైపు.. బర్డ్ ఫ్లూ కారణంగా గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోయిందని అక్కడి అధికారులు వెల్లడించారు. 

Also Read: America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్‌ గ్యాప్‌ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?

లక్ష గుడ్లను...

ఈ క్రమంలోనే సుమారు 35 లక్షల రూపాయల గుడ్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఏకంగా  లక్ష గుడ్లను దుండగులు ఎత్తుకెళ్లినట్లు తాజాగా పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఈ విషయం కాస్తా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కోడి గుడ్ల కొరత నెలకొనగా.. ఇప్పుడు ఏకంగా లక్ష గుడ్లు దొంగతనానికి గురి కావడం సంచలనంగా మారింది.

Also Read: Manipur: ఏకే 47 తుపాకులుతో ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌...వైరల్‌ అవుతున్న వీడియోలు!

పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గ్రీన్‌క్యాసెల్‌ నగరంలో ఉన్న పీట్‌ అండ్‌ గ్యారీస్‌ ఆర్గానిక్స్‌ ఎల్‌ఎల్‌సీ సంస్థకు చెందిన లక్ష గుడ్లను దొంగలు ఎత్తుకెళ్లారు. రిటైల్ షాపులకు సరఫరా చేసేందుకు గుడ్లను లారీల్లో లోడ్ చేయగా.. ఆ లోడ్ నుంచి దొంగలు కోడి గుడ్లను ఎత్తుకెళ్లినట్లు సదరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. 

చోరీ అయిన గుడ్ల విలువ 40 వేల డాలర్లు అని.. అంటే  భారత కరెన్సీలో దాదాపు రూ.35 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.గత కొన్ని రోజులుగా కోడి గుడ్ల కొరతతో అమెరికావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 ఏళ్ల క్రితం డజన్ గుడ్లు ఒక డాలర్ అంటే మన కరెన్సీలో రూ.84 ఉండగా.. ఇప్పుడు అదే డజన్ గుడ్ల ధర ఏకంగా 7 డాలర్లు అంటే దాదాపు రూ.590 పలుకుతున్నట్లు చెబుతున్నారు. గుడ్ల కొరత కారణంగానే ఒక్కసారిగా వీటి ధర అమాంతం పెరిగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. 

ఇక అమెరికాలో గుడ్ల ధరలు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకటి బర్డ్‌ఫ్లూ కాగా.. మరొకటి పెరుగుతున్న గుడ్ల డిమాండ్. గత 2 ఏళ్లుగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో క్రమంగా బర్డ్‌ఫ్లూ ప్రభావం పెరుగుతూ వస్తోంది. గత దశాబ్దకాలంలోనే ఇంతటి భారీ స్థాయిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాపించడం ఇదే తొలిసారి.

మరోవైపు.. గతనెలలో లూసియానా రాష్ట్రంలో మనుషులకు కూడా ఈ ప్రాణాంతకరమైన స్థాయిలో ఉండే బర్డ్‌ఫ్లూ వేరియంట్‌ను డాక్టర్లు కనుగొన్నారు. దీంతో పౌల్ట్రీ యజమానులు.. ప్రతి నెలా లక్షలాది కోళ్లను చంపేస్తున్నారు. 2022లో బర్డ్ ఫ్లూ కారణంగా 10.4 కోట్ల గుడ్లు పెట్టే కోళ్లు చనిపోయాయని యునైటెడ్ ఎగ్ ప్రొడ్యూసర్స్ వెల్లడించింది. ఇవే కాకుండా గతేడాది అక్టోబర్‌లో 29 లక్షల కోళ్లు చనిపోయాయని.. ఈ కారణంగానే అమెరికాలో ప్రస్తుతం గుడ్ల కొరత ఏర్పడినట్లు చెబుతున్నారు.

 బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినలేని అమెరికన్లు మొత్తం.. ఇప్పుడు గుడ్లు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని.. అందుకే గుడ్ల ధరలు భారీగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌...11 రోజుల పాటు ఈ రైళ్లు రద్దు!

Also Read: Hyderabad: రూ.99 కే హైదరాబాద్‌- విజయవాడకి ఈవీ బస్సుల్లో ప్రయాణం..పూర్తి వివరాలు ఇవే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు