మరో ప్రాణం తీసిన పరువు హత్య.. వేరే కులస్థుడిని ప్రేమిస్తుందని తల్లి ఏం చేసిందంటే?

గిరిజన యువకుడిని ప్రేమిస్తుందని తల్లి కూతురిని చంపిన దారుణ ఘటన తిరుపతిలో జరిగింది. మైనర్ బాలిక ఓ యువకుడితో గర్భం దాల్చగా.. తల్లి పోక్సో చట్టం కింద కేసు పెట్టి జైలుకి పంపించింది. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇద్దరూ మళ్లీ కలవడంతో తల్లి కూతురిని చంపేసింది.

New Update
Dead Body

Tirupathi

దళిత యువకుడిని ప్రేమించినందుకు కన్న కూతురినే తల్లి చంపేసిన దారుణ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక సమీపంలోని ఓ గిరిజన యువకుడిని ప్రేమించింది. అయితే కూతురు గర్భం దాల్చడంతో తల్లి అబార్షన్‌ చేయించి.. యువకుడికి కాస్త దూరంగా ఉంచింది. ఈ క్రమంలో ఆ యువకుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టి జైలుకి పెట్టించింది.

ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!

తల్లే బాలికను చంపి ఆ తర్వాత.. తెలియనట్లు..

మళ్లీ ఆ యువకుడు బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసి తిరిగారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి బాలికకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించింది. కానీ బాలిక మాట వినకుండా తనకి నచ్చినట్లుగా ఉంది. మళ్లీ బాలిక ఆ యువకుడిని కలవడానికి వెళ్తుంటే.. తల్లి ఆపింది. ఈ క్రమంలో బాలిక ఎదురు తిరగడంతో తల్లి కొట్టింది. దీంతో ఆ బాలిక అకస్మాత్తుగా కింద పడి మృతి చెందింది. అయితే బాలిక మృతి చెందడంతో తల్లి ఇంటికి తాళం వేసుకుని పనికి వెళ్లింది.

ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్‌ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..

ఆ తర్వాత భర్తకు ఫోన్ చేసి.. పాఠశాలకు వెళ్లేందుకు లేపమని పంపించేసరికి కుమార్తె చనిపోయి ఉంది. అయితే బంధువులు అందరూ కలిసి బాలిక మృతదేహాన్ని గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి దహనం చేశారు. అయిత ఈ విషయంపై పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే దర్యాప్తు చేపట్టగా.. ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇది కూడా చూడండి: China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు