/rtv/media/media_files/2025/06/26/lorry-2025-06-26-09-29-34.jpg)
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలోని ఇటిక్యాల గ్రామ సమీపంలో రెండు లారీలు ఢీకొనడంతో ఒక డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన వాటిలో ఒకటి సంతూర్ సబ్బులతో వెళ్తున్న లారీ. ఇందులోని సబ్బులు రోడ్డు మీద పడటంతో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. బాధితుల కోసం కాకుండా సంతూర్ సబ్బుల కోసం కొందరు స్థానికులు ఎగబడ్డారు.
ఇది కూడా చూడండి: Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్
సబ్బుల కోసం ఎగబడిన స్థానికులు..
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకునేలోగా లారీ లోడు మొత్తం సగం అయ్యింది. దాదాపుగా రూ.లక్ష ఖరీదైన సబ్బులను స్థానిక ప్రజలు తీసుకెళ్లిపోయారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఘటనా ప్రాంతంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్
ఇదిలా ఉండగా.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్లోని దుర్గాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని ఓ వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఎస్సై, కానిస్టేబుల్ మృతి చెందారు. వీరు ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై అశోక్, కానిస్టేబుల్ వీరస్వామిగా గుర్తించారు.
ఇది కూడా చూడండి: Maargan: మొదటి ఆరు నిమిషాలతో భయపెడుతున్న ఆంటోనీ 'మార్గన్'! వీడియో చూశారా?
పని నిమిత్తం హైదరాబాద్కు బయలుదేరగా.. మార్గంమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.