/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
suicide
పంట దిగుబడి రాక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు దేశంలో ఎందరో ఉన్నారు. పెట్టుబడి పెట్టి ఏడాది మొత్తం ఎంతో కష్టపడతారు. కానీ వారి కష్టానికి ప్రతిఫలం లభించదు. దీంతో పంట పండించడానికి చేసిన అప్పులను తీర్చలేక కొందరు రైతులు ఆత్మహత్యే దారి అనుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల మహబూబాబాద్లో చోటుచేసుకుంది. పంట దిగుబడి రాకపోవడంతో అప్పులు తీర్చలేక మనోవేదన చెంది రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జరిగింది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
రూ.10 లక్షలు అప్పు తీర్చలేక..
గూడురు మండలానికి చెందిన బానోతు హచ్య అనే వ్యక్తి రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. దీనికి మరో రెండు ఎకరాలు కౌలుకి తీసుకుని వరి పంట పండిస్తున్నారు. అయితే పండించడానికి పెట్టుబడి కోసం రూ.10 లక్షలు అప్పు చేశారు. చివరకు పంట నష్టం వచ్చింది. ఆ అప్పు తీర్చలేను ఏమోనని మనోవేదన చెంది.. వ్యవసాయ భూమి దగ్గర ఉన్న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI
ఇదిలా ఉండగా ఇటీవల ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో వినీత్ దూబే అనే వ్యక్తి జుట్టు మార్పిడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. గోరఖ్పూర్కు చెందిన వినీత్ పంకీ పవర్ ప్లాంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మార్చి 13న అతను జుట్టు మార్పిడి కోసం ఎంపైర్ వారాహి క్లినిక్ను సంప్రదించాడు. అక్కడ అనుష్క తివారీ అనే మహిళా డాక్టర్ను కలిశాడు.
ఇది కూడా చూడండి: పాకిస్థాన్ కిరానా హిల్స్లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!
చికిత్సలో భాగంగా ఆమె ఒక ఇంజెక్షన్ ఇచ్చింది. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే వినీత్ ముఖం ఉబ్బిపోయింది. వెంటనే ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు అందించిన చికిత్స ఫలించక అతను ప్రాణాలు కోల్పోయాడు.