/rtv/media/media_files/2025/08/20/student-on-teacher-2025-08-20-11-25-45.jpg)
Student love lady teacher
Crime News: మధ్యప్రదేశ్లో జరిగిన ఓ షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 18ఏళ్ల యువకుడు టీచర్ని ప్రేమించాడు. ఆమె ప్రేమ నిరాకరించి.. స్కూల్లో అతనిపై కంప్లైయింట్ ఇచ్చింది. ఆ కోపంతో విద్యార్థి ఉపాధ్యాయురాలిపై పెట్రోల్ దాడి చేశాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 26ఏళ్ల బాధితురాలు ఓ ప్రైవేట్ పాఠశాలలో గెస్ట్ టీచర్గా పనిచేస్తున్నారు. నిందితుడు సూర్యాంశ్ కోచర్ (18) గతంలో అదే పాఠశాలలో చదువుకున్న మాజీ విద్యార్థి. సూర్యాంశ్ గత రెండేళ్లుగా టీచర్ మీద ప్రేమను పెంచుకున్నాడు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా టీచర్ చీరలో స్కూల్కు వచ్చారు. ఆమెతో సూర్యాంశ్ అసభ్యకరంగా మాట్లాడారు. దీనితో టీచర్ అతనిపై పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఆగ్రహించిన సూర్యాంశ్ కక్ష పెంచుకున్నాడు.
టీచర్ పై పెట్రోల్ పోసి..
సోమవారం (ఆగస్ట్ 18) మధ్యాహ్నం టీచర్ ఇంట్లో ఉన్న సమయంలో, సూర్యాంశ్ పెట్రోల్ బాటిల్తో ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉపాధ్యాయురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనతో టీచర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమెకు సుమారు15 శాతం కాలిన గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన తర్వాత సూర్యాంశ్ అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు వెంటనే నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు సూర్యాంశ్ ను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Crime News: మరో భర్త బలి.. మరిగే నూనె పోసి అతి కిరాతంగా హత్య చేసిన భార్య
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDOP) మనోజ్ గుప్తా మాట్లాడుతూ, ఇది ఒకవైపు ప్రేమ మరియు వ్యక్తిగత కక్షతో జరిగిన దాడి అని చెప్పారు. ఇలాంటి దారుణమైన ఘటనలు సమాజంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.