Rape Case: అమానుషం..17ఏళ్ల బాలికపై 9మంది యువకులు అత్యాచారం!

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఝలావర్ జిల్లాలో 17ఏళ్ల బాలికపై 9మంది యువకులు లైంగిక దాడి చేశారు. మలవిసర్జనకు వెళ్లిన ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు మైనరు ఉండగా అందిరినీ అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ బ్రిజేష్ కుమార్ తెలిపారు.

New Update
 Suryapet crime

Rajasthan 17year old girl sexually assaulted

Rape Case: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఝలావర్ జిల్లాలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లికి వెళ్లిన ఆమె మలవిసర్జన చేయడానికి చెట్లపొదల్లోకి వెళ్లింది. ఈ క్రమంలోనే 9 మంది పురుషులు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి లైంగిక దాడి చేశారు. అమ్మాయి పేరెంట్స్ ఫిర్యాదుతో ఒక మైనర్ సహా తొమ్మిది మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. వారిని కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. 

Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?


Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

ఒకే గ్రామానికి చెందినవారు..

ఈ ఘటనపై ఫిర్యాదు రాగానే పిల్లల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ బ్రిజేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం 9 మంది నిందితుల్లో 8 మందిని పోక్సో కోర్టులో హాజరుపరిచాం. అక్కడి నుంచి వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఆదేశించినట్లు కుమార్ తెలిపారు. మైనర్ నిందితుడిని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచగా.. అక్కడి నుండి అతన్ని జువెనైల్ షెల్టర్ హోమ్‌కు పంపాలని ఆదేశించారు. బాధితురాలు ఈ కేసులోని కొంతమంది నిందితులతో పరిచయం కలిగి ఉందని, వారు ఒకే గ్రామానికి చెందినవారని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

Also Read: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..

 rape-case | gujarath | women | telugu-news | today telugu news 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు