/rtv/media/media_files/2025/03/20/ZIRgW0unwzIry2h6Je2C.jpg)
Rajasthan 17year old girl sexually assaulted
Rape Case: రాజస్థాన్లో దారుణం జరిగింది. ఝలావర్ జిల్లాలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లికి వెళ్లిన ఆమె మలవిసర్జన చేయడానికి చెట్లపొదల్లోకి వెళ్లింది. ఈ క్రమంలోనే 9 మంది పురుషులు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి లైంగిక దాడి చేశారు. అమ్మాయి పేరెంట్స్ ఫిర్యాదుతో ఒక మైనర్ సహా తొమ్మిది మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. వారిని కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
ఒకే గ్రామానికి చెందినవారు..
ఈ ఘటనపై ఫిర్యాదు రాగానే పిల్లల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ బ్రిజేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం 9 మంది నిందితుల్లో 8 మందిని పోక్సో కోర్టులో హాజరుపరిచాం. అక్కడి నుంచి వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఆదేశించినట్లు కుమార్ తెలిపారు. మైనర్ నిందితుడిని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచగా.. అక్కడి నుండి అతన్ని జువెనైల్ షెల్టర్ హోమ్కు పంపాలని ఆదేశించారు. బాధితురాలు ఈ కేసులోని కొంతమంది నిందితులతో పరిచయం కలిగి ఉందని, వారు ఒకే గ్రామానికి చెందినవారని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Also Read: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..
rape-case | gujarath | women | telugu-news | today telugu news