Gurumurthy: మాధవిని కాలుస్తుంటే వాసన.. తలకాయ కూర అనుకుని లైట్ తీసుకున్న పక్కింటోళ్లు.. వెలుగులోకి సంచలన విషయాలు!

మీర్‌పేట్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సంక్రాతిరోజు గురుమూర్తి భార్యను ఉడికించినపుడు మధ్యాహ్నం భిన్నమైన కమురు వాసన వచ్చిందని పోలీసుల దర్యాప్తులో స్థానికులు చెప్పారు. మేక తలకాయ, కాళ్ల కూర వండుకుంటున్నారని వారు పెద్దగా పట్టించుకోలేదట. 

New Update
guru murthy

Guru murthy wife murder case

Gurumurthy: మీర్‌పేట్ మర్డర్ కేసు(Meerpet Murder Case)లో మరిన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. జనవరి 15న గురుమూర్తి తన భార్య వెంకటమాధవి చంపి, ఆమె మాంసాన్ని ఉడకబెట్టి, ఎముకలను స్టవ్‌పై కాల్చి పొడి చేసిన విషయం అంగీకరించాడు. అయితే కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు పక్కింటి వారిని వివరాలు అడిగి తెలుసుకోగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురుమూర్తి ఇంట్లోనుంచి దుర్వాసన రావడంతో ఎవరికైనా మంటలు అంటుకున్నాయా, లేదా ఏదైనా అగ్ని ప్రమాదామా అని దగ్గరిదాకా వచ్చి పరిశీలించారట. కానీ అది సంక్రాతి పండుగ రోజు కావడంతో మేక తలకాయ, కాళ్ల కూర వండుతున్నారేమోనని భావించి లోపలికి రాకుండా వెళ్లిపోయారట.  

ఇది కూడా చదవండి: వాటర్ బాంబ్ కు ధీటుగా..చైనా సరిహద్దుల్లో బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్

ఆ రోజు భవనం మొత్తం ఖాళీ..

అలాగే గురుమూర్తి కుటుంబం అద్దె ఉంటున్న భవనం పండగరోజు దాదాపు ఖాళీగా ఉంది.  యజమానితో సహా మరో నాలుగు కుటుంబాలు సంక్రాంతికి ఊరెళ్లిపోయాయి. ఇది గురుమూర్తికి బాగా కలిసొచ్చింది. పక్కనే ఉన్న కొన్ని ఇళ్లు కూడా ఖాళీగా ఉన్నాయి. అయితే అదే భవనం నుంచి మధ్యాహ్నం సమయంలో భిన్నమైన వాసన రావడంతో ఒక కుటుంబ సభ్యులంతా ఇంటి దగ్గరలోకి వచ్చి గమనించారట. ఎలాంటి పొగ లేదు.  మంటలు లేవు. వాసన మాత్రం వస్తోంది. అయితే ఎవరో ఏదో జంతు మాంసం వండుకుంటున్నారేమోనని భావించి వారంతగా పట్టించుకోలేదని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: Kumbhamela: కుంభమేళా కంటే లండన్ వెళ్లడమే చీప్.. ఆకాశాన్నంటుతున్న ఫ్లైట్ టికెట్ ధరలు!

గురుమూర్తి అద్దెకు తీసుకున్న భవనంలో వీరి 2 BHK పోర్షన్ మెయిన్ డోర్ వెనకభాగాంలో ఉంది. దీని కారణంగా కూడా పొరుగువారు వెనుకకు వెళ్లి చెక్ చేయడానికి పెద్దగా సాహసం చేయలేదని దర్యాప్తు అధికారి చెప్పారు. పండగరోజు మధ్యాహ్నం సమయానికి గురుమూర్తి తన భార్య మృతదేహాన్ని నరికి, మాంసాన్ని ఉడకబెట్టి, ఆమె ఎముకలను కాల్చే పనిలో ఉన్నాడని తెలిపారు. భవనం ఖాళీగా ఉండటంతో వాసనను పసిగట్టడానికి ఎవరైనా వస్తారని అతను ఊహించలేదు కాబట్టి అతను ఎలాంటి ఆటంకం లేకుండా చర్యను కొనసాగించాడన్నారు. భవనంలోని కొంతమంది భయంతో అప్పటికే ఖాళీ చేయగా యజమాని, ఇతర పొరుగువారి నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు. త్వరలోనే గురుమూర్తి పక్కనుండే ఇతర అద్దెదారులను స్టేట్‌మెంట్‌లను నమోదు చేసి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: 4-Day Work Week: శాశ్వతంగా వారానికి నాలుగు రోజులే పని.. 200 కంపెనీలు సంచలన నిర్ణయం

ఇది కూడా చదవండి: గూగుల్‌ మ్యాప్స్‌లో మారిన గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరు..కానీ అక్కడ మాత్రం!

Advertisment
Advertisment
తాజా కథనాలు