Jaipur Viral News: సెప్టిక్‌ ట్యాంక్‌లో బంగారం వేట.. ఊపిరాడక నలుగురు కూలీలు మృతి

రాజస్థాన్‌లోని జైపుర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. సెప్టిక్‌ ట్యాంక్‌లో పేరుకుపోయిన బంగారం మడ్డిని తీసుకురావడానికి వెళ్లిన నలుగురు కూలీలు ఊపిరాడక మృతి చెందారు. ఈ విషాద ఘటన  పారిశుద్ధ్య పనుల్లో కార్మికుల భద్రతపై ఆందోళనలను మళ్లీ రేకెత్తించింది. 

New Update
jaipur septic tank

Jaipur Viral News

Jaipur Viral News: రాజస్థాన్‌(Rajasthan)లోని జైపుర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. సెప్టిక్‌ ట్యాంక్‌(Septic Tank)లో పేరుకుపోయిన బంగారం మడ్డిని తీసుకురావడానికి వెళ్లిన నలుగురు కూలీలు ఊపిరాడక మృతి చెందారు. తొలుత ఆ పని చేయడానికి కూలీలు నిరాకరించినా...అదనంగా డబ్బులు ఇస్తామని గోల్డ్ షాపు యజమాని చెప్పడంతో ఆశతో కూలీలు ఈ పనికి ఒప్పుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు.  

    సీతాపుర పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలోని 10 అడుగుల సెప్టిక్ ట్యాంక్‌లోకి ముందుగా అమిత్, రోహిత్ సెప్టిక్  దిగారు.  నిమిషాల్లోనే వారు స్పృహ కోల్పోవడం మొదలుపెట్టి సహాయం కోసం కేకలు వేశారు. వారిని కాపాడటానికి తోటి కార్మికులు  సంజీవ్, హిమాన్షు, అర్పిత్, అజయ్, రాజ్ పాల్, ముఖేష్  ట్యాంక్ లోకి దిగారు. అయితే ఊపిరాడక వారంతా స్పృహ కోల్పోయారు. కార్మికులు 10 అడుగుల లోతు గల సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగగానే విషపూరిత పొగలు వచ్చాయి. ఆ తర్వాత కార్మికులను ట్యాంక్ నుండి బయటకు తీసి మహాత్మా గాంధీ ఆసుపత్రికి తరలించారు.

    Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!

    ఇద్దరు డిశ్చార్జ్

    అయితే, సంజీవ్, హిమాన్షు, రోహిత్, అర్పిత్ లు అక్కడికి చేరుకునే లోపే మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. స్థానిక పోలీసు(Police) అధికారి అనిల్ జైమాన్ మాట్లాడుతూ, ఫోరెన్సిక్ బృందాలు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాయని అన్నారు.  ఈ విషాద ఘటన  పారిశుద్ధ్య పనుల్లో కార్మికుల భద్రతపై ఆందోళనలను మళ్లీ రేకెత్తించింది. 

    Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!

     Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

    Advertisment
    Advertisment
    తాజా కథనాలు