Love Marriage Case: షాకింగ్ వీడియో.. బతికుండగానే కూతురికి అంత్యక్రియలు చేసిన తండ్రి

మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లా, ఉదయ్‌గఢ్ గ్రామంలో ఒక తండ్రి తన కూతురు ప్రేమ వివాహం చేసుకున్నందుకు గానూ ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడం సంచలనం రేపింది. తమ సమాజానికి ఇది ఆమోదయోగ్యం కాదని, కుటుంబ పరువు పోయిందని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

New Update
father Tribute to his daughter after daughter love marriage

father Tribute to his daughter after daughter love marriage

మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లా ఉదయ్‌గఢ్ గ్రామంలో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తండ్రి బతికి ఉన్న తన కూతురుకి అంత్యక్రియలు నిర్వహించడం సంచలనంగా మారింది. ఆ అంత్యక్రియల్లో బంధువులు సైతం పాల్గొనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: చనిపోయిందనుకుని అంత్యక్రియలు.. ఆఖరి నిమిషంలో లేచి గుక్కపెట్టి ఏడ్చిన శిశువు!

బతికున్న కూతురికి శ్రద్ధాంజలి

అలీరాజ్‌పూర్ జిల్లాలోని ఉదయ్‌గఢ్ గ్రామంలో రాజ్‌పుత్ వర్గానికి చెందిన 19 ఏళ్ల అమ్మాయి అదే గ్రామానికి చెందిన మరొక వర్గానికి చెందిన అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఆ అమ్మాయి చేసిన పనికి ఆ కుటుంబం తీవ్ర ఆగ్రహానికి గురైంది. వెంటనే ఆ అమ్మాయి తండ్రి కీలక నిర్ణయం తీసుకున్నాడు. తమ కూతురు వేరే వర్గానికి చెందిన అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో.. వారితో ఉన్న అన్ని సంబంధాలను ఆ కుటుంబం తెంచుకుంది. 

Also Read:మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!

బతికున్న తన కూతురికి తమ ఆచారాల ప్రకారం తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. బంధువులు, స్నేహితులు ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. సొసైటీ సమక్షంలో జరిగిన శ్రాద్ధోత్సవంలో ఆ అమ్మాయి ఫోటోను ఉంచారు. ఫోటోపై ఆమె మరణించిన తేదీ రాసి పెట్టారు (ఈ తేదీ ఆమె ఇంటి నుండి బయటకు వెళ్లిన రోజు). 

Also Read:ఢిల్లీలో దారుణం.. కూలిన నాలుగు అంతస్తుల భవనం!

ఈ విషయంపై అమ్మాయి తండ్రి చందన్ సింగ్ పన్వర్ మాట్లాడుతూ.. జూలై 3న పరీక్ష రాయడానికి ఝబువా వెళ్తున్నానని చెప్పి తన కూతురు ఇంటి నుండి వెళ్లిపోయిందని, తిరిగి ఆమె ఇంటికి రాలేదని తెలిపాడు. తమ సమాజంలో ఇలాంటి ప్రేమ వివాహాలు ఆమోదయోగ్యం కాదని, తమ కూతురు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కుటుంబానికి పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏ కుటుంబంలోనూ ఇలాంటి సంఘటనలు జరగకూడదనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు