/rtv/media/media_files/2025/08/14/dharmasthala-case-2025-08-14-18-10-12.jpg)
Dharmasthala case
కర్ణాటక(Karnataka) లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల(Dharmasthala case updates) లో జరిగిన సామూహిక హత్యలు, అంత్యక్రియల వివాదం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఓ మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మృతదేహాలు ఖననం కోసం తనకు ఆలయ పెద్దల నుంచే ఆదేశాలు వచ్చాయని సంచలన ఆరోపణలు చేశారు. రెండు దశాబ్దాలకు పైగా ధర్మస్థలలో తాను చేసిన భయంకరమైన పనులను వివరిస్తూ, ఈ సామూహిక అంత్యక్రియల వెనుక ఆలయ నిర్వహణ పెద్ద పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందని ఆయన స్పష్టం చేశారు.
Also Read : అహింసావాది గాంధీజీయే 60 కుక్కలు చంపించాడు.. 1927లో ఏం జరిగిందంటే?
Dharmasthala Case
Speaking to the media regarding the Dharmasthala case, DK Shivakumar said that a big conspiracy is going on.
— 🇮🇳 Madhukumar.V.P🇮🇳 (@MadhukumarVP1) August 14, 2025
Sir @DKShivakumar ,, You are the Deputy Chief Minister of the state,,, Those who have hatched this conspiracy should be found and given appropriate punishment. pic.twitter.com/OaIX6YhIxl
1995 నుండి 2014 మధ్య కాలంలో వందలాది మృతదేహాలను ఖననం చేయాలని ఆలయ పెద్దలు ఆదేశించారని, దీనిపై నోరు విప్పితే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని అప్పడు పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన వ్యక్తి మీడియాకు తెలిపాడు. ఈ మృతదేహాల్లో ఎక్కువ మంది మహిళలు, మైనర్ బాలికలేనని, వారిపై లైంగిక దాడులు, హత్యలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అతను పోలీసులకు తెలిపాడు. ఈ మృతదేహాలను నేత్రావతి నది తీరంలో, సమీపంలోని అటవీ ప్రాంతాల్లో ఖననం చేసినట్లు అతను చెప్పాడు.
DHARMASTHALA CASE: ಕಳೇಬರ ಸಿಕ್ಕಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಾನೇನು ಮಾಡೋಕೆ ಆಗುತ್ತೆ? ಮಾಸ್ಕ್ಮ್ಯಾನ್ ಹೇಳಿಕೆ
— navasamaja (@navasamajanews) August 14, 2025
https://t.co/3cgNOWuiV4#dharmasthala#DharmasthalaCase#dharmasthalamassburial#maskman#dharmasthalacasetwist#navasamajanews#KannadaNews
Also Read : ఆపరేషన్ సింధూర్లో పని చేసిన 16మంది BSF జవాన్లకు అవార్డులు
ఈ ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం విజిల్ బ్లోయర్ చూపించిన ప్రదేశాలలో తవ్వకాలు జరిపి, ఇప్పటికే కొన్ని మానవ అవశేషాలు, ఎముకలను కనుగొంది. ఇది అతని వాదనలకు బలం చేకూరుస్తోంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, ధర్మస్థల ఆలయ ధర్మకర్త వీరేంద్ర హెగ్డే, అతని కుటుంబంపై పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా బెంగళూరులోని సివిల్ కోర్టు మధ్యంతర నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, ఈ నిషేధ ఉత్తర్వులు పత్రికా స్వేచ్ఛకు విఘాతమని, ప్రజల ముందు ఉన్న నిజాలను దాచడానికి ప్రయత్నించే చర్య అని పలు పత్రికా సంస్థలు, మానవ హక్కుల కార్యకర్తలు విమర్శించారు. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, దోషులు ఎంతటి వారైనా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ధర్మస్థల వంటి పవిత్ర క్షేత్రంలో ఇలాంటి దారుణాలు జరిగాయని చెప్పడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
latest-telugu-news | Sanitation workers | dark side of Dharmasthala | Dharmasthala Burial Case Mystery | telugu-news | telugu crime news | national news in Telugu