/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Blast-jpg.webp)
Hyderabad
హైదరాబాద్ నగరం పరిధిలోని ముషీరాబాద్లో బుధవారం రాత్రి భారీ పేలుడు జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాంలో భారీ పేలుడు సంభవించడంతో ఓ కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భోలక్పూర్ గుల్షన్ నగర్ కట్ని కాంట సమీపంలో ప్లాస్టిక్ గోదాం ని రన్ చేస్తున్నారు.
అందులో బీహార్కు చెందిన ఇసాక్ అహ్మద్(28) అనే వ్యక్తి ప్లాస్టిక్ వస్తువులను పగులగొట్టి శుభ్రపరిచే పని లో ఉన్నాడు. ఈ క్రమంలో ఓ కెమికల్ డబ్బా పగులగొడుతుండగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో ఏం జరిగిందో చుట్టుపక్కల వారికి అర్థం కాలేదు. దీంతో అందులో పని చేస్తున్న వ్యక్తి గురించి పెద్దగా పట్టించుకోలేదు.దీంతో అందులో పని చేస్తున్న ఇసాక్ అహ్మద్ తీవ్రం గాయాలపాలయ్యారు.
పేలుడు ధాటికి చేతులు, ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Telangana: తెలంగాణవాసులకు వాతావరణ శాఖ ముఖ్య సమాచారం.. ఇక ఎండ దంచుడే దంచుడు!