/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
Bhadradrikottagudem Sujatha death mystery solved Police
TG News: భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో ఇటీవల జరిగిన మిస్టరీ డెత్ కేసును పోలీసులు ఛేధించారు. జనవరి 25న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బండి సుజాత (40)ను కన్నకొడుకే హత్యచేసినట్లు సుజాతనగర్ పోలీసులు నిర్ధారించారు. మృతురాలు సుజాత మెడ భాగం కమిలినట్లు గుర్తించిన పోలీసు బృందం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే మెడ భాగంలో గాయాలుండటంతో ఊపిరి ఆడక మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడవగా కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు భయంకరనిజాలు బయటపెట్టారు.
పందెం కోళ్ల తాడుతో గొంతు బిగించి..
ఈ మేరకు నిమ్మలగూడెం గ్రామస్థులతోపాటు సుజాత కుటుంబ సభ్యులను పలుకోణాల్లో విచారించారు పోలీసులు. బండిసుజాత తనయుడు బండి పవన్పై మొదటినుంచే అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా అసలు నిజం కక్కేశాడు. పందెం కోళ్ల తాడుతో తన తల్లిసుజాత గొంతుబిగించి హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆమె చనిపోయిన తర్వాత తనకేం తెలియదన్నట్లు ప్రవర్తించానని, తల్లి మరణం సహాజంగా లేదా ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందని అందరినీ నమ్మించాలని చూసినట్లు పవన్ తెలిపాడు.
ఇది కూడా చదవండి: ICC Rankings : నక్కతోక తొక్కాడు.. టాప్-5లోకి వరుణ్ చక్రవర్తి
అయితే తన తల్లి సుజాతను చంపేందుకు బలమైన కారణం ఉందన్నాడు. తమ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తితో తన తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందని పోలీసుల విచారణలో బయటపెట్టాడు. ఈ నెల 25న ఇంటి ఆరుబయట సమీప పొలంలో తనతల్లి ప్రభాకర్ అనే వ్యక్తితో ఉండటాన్ని చూసి కోపోద్రిక్తుడైన పవన్.. ప్రభాకర్ పై దాడిచేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అడ్డొచ్చిన తల్లి సుజాతను కోపంలోనే తాడుతో గొంతు బిగించి హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు పవన్ ను రిమాండ్ కు తరలించిన పోలీసులు.. ఈ కేసును 72 గంటల్లో చేధించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: వరంగల్లో పాక్ ఉగ్రవాదుల కలకలం.. బిర్యానీ సెంటర్ నడుపుతూ..!