/rtv/media/media_files/2025/02/06/96PeaR0hKkht3gP21e1m.webp)
Bapatla
ఏపీలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బాపట్ల జిల్లాలోని తిమ్మరాజుపాలెం వద్ద గ్రానైట్ పలకల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ పలకల కింద పడి స్పాట్లోనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మార్టూరు నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పలకలను తొలగించారు. అయితే మృతులను పాలపర్తి శ్రీను (25), తాళ్లూరి ప్రభుదాస్ (37), తమ్ములూరి సురేంద్ర (26)గా పోలీసులు గుర్తించారు. వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు
కడపలో ఇటీవల ఘోర ప్రమాదం..
ఇదిలా ఉండగా ఇటీవల ఏపీలో కూడా ఇలాంటి ఓ యాక్సిడెంట్ జరిగింది. ఏపీలోని కడపలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పెండ్లిమర్రి కొత్తూరు వద్ద వేగంగా వెళ్తున్న కంటైనర్ బైక్ ను ఢీ కొట్టింది. ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.మృతులు వేంపల్లి శ్రీరామ్ నగర్ గుట్టకు చెందిన బాలయ్య, రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మల్లికార్జున, మదనపల్లికి చెందిన మల్లికార్జున గా గుర్తించారు.
ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్లో ప్రజల తిరుగుబాటు
ఘటనా గురించి తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసి కేసు నమోదు చేశారు. వెంటనే ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఊహించని ప్రమాదంతో ముగ్గురి మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!
crime news | latest-telugu-news | road-accident