Tamil Nadu: సంచలన తీర్పు.. లైంగిక వేధింపుల కేసులో 8మందికి జీవిత ఖైదు

తమిళనాడు పొల్లాచిలో ఆరేళ్ల క్రితం మహిళలను లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్ చేసిన 9 మందిని అరెస్ట్ చేశారు. మంగళవారం సెషన్స్ కోర్టు వారిలో 8 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2019లో 8 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

New Update
Pollachi Blackmail case

తమిళనాడు పొల్లాచ్చిలో మహిళలను బ్లాక్‌మెయిల్ చేసి లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆరు సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తోంది. మే 13న ఫైనల్ తీర్పు ఇచ్చింది. మొత్తం ఈ కేసులో తొమ్మిది మందిపై ఆరోపణలు ఉన్నాయి. సెషన్స్ కోర్టు కోర్టు వారిని దోషులుగా ప్రకటిస్తూ న్యాయమూర్తి ఆర్ నందిని దేవి ఎనిమిది మందికి 7 సంవత్సరాల శిక్ష విధించింది. వీరు బాధిత మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్లు తేలింది. 

Also Read :  ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!

Also Read :  పాకిస్తాన్‌కు ఆర్మీ ఆపరేషన్స్ లీక్ చేస్తున్న అధికారి.. దేశం విడిచి వెళ్లిపోవాలన్న కేంద్రం

మొత్తం తొమ్మిది మంది దోషులకు శబరిరాజన్ అలియాస్ రిష్వంత్, తిరునావుకరసు, టి వసంత కుమార్, ఎం సతీష్, ఆర్ మణి అలియాస్ మణివన్నన్, పి బాబు, హరోన్ పాల్ , అరుళనంతం, అరుణ్ కుమార్‌లకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. దేశావ్యాప్తంగా 2019లో సంచలనంగా మారిన కేసు ఇది. అరెస్టు చేసినప్పటి నుంచి నిందితులు సేలం సెంట్రల్ జైలులో ఉన్నారు. మంగళవారం ఉదయం వారిని భారీ పోలీసు భద్రత మధ్య కోయంబత్తూరులోని కోర్టుకు తీసుకువచ్చారు. విచారణ సమయంలో 200కి పైగా డ్యాకుమెంట్లు, 400 ఎలక్ట్రానిక్ ఆధారాలు, దాడులకు సంబంధించిన ఫోరెన్సిక్ ధృవీకరించబడిన వీడియోలు పోలీసులు సమర్పించారు. బాధితులు కేవలం ఎనిమిది మంది మాత్రమే బయటకు వచ్చి ఫిర్యాదు చేశారని ఇంకా చాలామందిని వీరు మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. 

Also Read :  IPL 2025: 10 ఓవర్లు కాదు 20.. పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌పై బిగ్ అప్ డేట్!

పొల్లాచి కేసు

8 మంది కాలేజ్ విద్యార్థినితో 2019లో పొల్లాచ్చి కేసు వెలుగులోకి వచ్చింది. 2016 నుంచి 2018 మధ్య కాలంలో బాధితులపై లైంగిక వేధింపులు, వీడియోలు తీయడం, డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేశారు నిందితులు. తొమ్మిది మందిపై IPCలోని పలు సెక్షన్ల కింద అత్యాచారం, సామూహిక అత్యాచారం, ఒకే బాధితురాలిపై పదే పదే అత్యాచారం, నేరపూరిత కుట్ర, లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్ వంటి అభియోగాలు మోపారు. బాధితులపై లైంగిక వేధింపులను వీడియోలు తీశారు. వాటిని ఉపయోగించి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారని పోలీసుల విచారణలో తేలింది. 

Also Read :  పురాణాల్లో సింధూరం వెనుక ఉన్న రహస్యం ఇదే!!

(tamil-nadu | latest-telugu-news | crime news | blackmail | Female Techie Blackmailed)

 

Advertisment
Advertisment
తాజా కథనాలు