Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..ట్రంప్ ప్రకటనే కారణం

నిన్న నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లోకి వచ్చాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ ప్రకటన మార్కెట్ మీద ప్రభావం చూపించింది. సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు పైకెగిసింది.

New Update
Stock Markets

ఈరోజు ఉదయం నుంచే స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు పెరిగి 82,500 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 200 పాయింట్లు పెరిగి 25,150 స్థాయిలో ఉంది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 29 స్టాక్‌లు పెరిగాయి. అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఆసియన్ పెయింట్స్ సహా 14 స్టాక్‌లు 3% వరకు పెరిగాయి. NTPC స్వల్పంగా క్షీణించింది. నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 46 లాభాల్లో ఉన్నాయి. NSEలోని అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ PSU బ్యాంకింగ్ 2.03%, రియాల్టీ 1.40%, ఐటీ 1.14%, ఆయిల్ & గ్యాస్ 0.7%, మెటల్-ఆటో 1.3% లాభాల్లో ఉన్నాయి.  

Also Read :  యుద్ధంలో ఇరాన్ ఈ 5 గుణపాఠాలు చేర్చుకోవాలి.. ఎంత నష్టమో తెలుసా..!

Also Read :  HYDలో ఒకే బైక్‌పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు దొరకడంతో.. (వీడియో)

మార్కెట్ బూమ్ కు కారణాలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణను ప్రకటించారు. ఇది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించే ఆశను పెంచింది. దీని కారణంగా మార్కెట్లో ఉత్సాహం వచ్చింది. అలాగే ఈరోజు ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 2% తగ్గి $67.13కి చేరుకున్నాయి. బ్రెంట్ ముడి చమురు ధర 1.8% తగ్గి బ్యారెల్‌కు $67.17కి చేరుకుంది. ఇరాన్ హర్మూజ్ జల సంధి మూసేయడంతో  చమురు ధరలు 10% పెరిగాయి. ఇక ఆర్‌బిఐ మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్ నియమాలను సులభతరం చేసింది. ఆర్‌బిఐ బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ప్రొవిజనింగ్ నియమాలను సడలించింది. దీనివల్ల బ్యాంకులకు ఎక్కువ నిధులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నిర్ణయం బ్యాంకింగ్ స్టాక్స్‌లో పెరుగుదలకు దారితీసింది. దాంతో పాటూ విదేశీ పెట్టుబడిదారుల సోమవారం ఎఫ్‌ఐఐలు రూ.5,591.77 కోట్ల విలువైన దేశీయ ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇవన్నీ దేశీ మార్కెట్ పెరుగుదలకు దోహదం చేశాయి. 

Also Read :  కూతురు చేతిలో దారుణంగా హత్యకు గురైన చాకలి ఐలమ్మ మనవరాలు

ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 1.08% పెరిగి 38,769 వద్ద, కొరియా కోస్పి 2.48% పెరిగి 3,089 వద్ద ట్రేడవుతున్నాయి.
హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 2.02% పెరిగి 24,168 వద్ద ట్రేడవుతుండగా.. చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.96% పెరిగి 3,414 వద్ద ట్రేడవుతోంది. ఇక జూన్ 23న అమెరికా డౌ జోన్స్ 0.89% పెరిగి 42,582 వద్ద ముగిసింది. ఇంతలో, నాస్డాక్ కాంపోజిట్ 0.94% పెరిగి 19,631 వద్ద ముగిసింది.  ఎస్&పి 500 0.96% పెరిగి 6,025 వద్ద ముగిసింది.

Also Read: US Army Bases: మిడిల్ ఈస్ట్ లోని అమెరికా కీలక స్థావరాలు ఇవే..

 

nifty | sensex-today | Stock Market | today-latest-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు