లాహోర్లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఆర్మీ విమానం లాహోర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా దాని టైర్లో ఒకటి మంటల్లో చిక్కుకుంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Bhavana
పహల్గాంలో పర్యాటకుల పై ఉగ్రదాడి తరువాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.ఉగ్రవాదులు,అనుమానితుల ఐదుగురు ఉగ్రవాదుల నివాసాలను దళాలు పేల్చేశాయి. Short News | Latest News In Telugu | నేషనల్
గ్రేటర్ హైదరాబాద్లో జూలై నాటికి అదనంగా 200 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వీటిలో 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉండనున్నాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ
పహల్గాం దాటి ఘటన పై పాక్ తన మాట మార్చింది.ఈ ఘటన పై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది.పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్ మమ్మల్ని నిందిస్తోందన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.నేను ఆ రెండు దేశాలకూ మంచి స్నేహితుడునే.కశ్మీర్ సమస్య వెయ్యేళ్లుగా అలాగే ఉంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
భారత్తో యుద్ధం తప్పదన్నవేళ పాకిస్థాన్ కు పెద్ద షాక్ తగిలింది.శుక్రవారం పాక్ లోని క్వెట్టాలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ జరిపిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ n
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశం పై చర్చలు జరిపేందుకు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరోసారి మాస్కోకు పయనమయ్యారు.ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
క్రిమియా రష్యాతోనే ఉంటుందని ట్రంప్ అన్నారు.ఆ ప్రాంతం రష్యాతో ఉన్నవిషయాన్ని జెలెన్ స్కీ సహా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు.జెలెన్ స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారని ఆరోపించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.Short News | Latest News In Telugu | నేషనల్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ ఛైర్మన్ డా.కృష్ణస్వామి కస్తూరి రంగన్ కన్నుమూశారు.ఆయన హయంలో ఇస్రో తొలి లూనార్ మిషన్కు అడుగులు పడ్డాయి.9 సంవత్సరాల పాటు ఇస్రో ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు.Short News | Latest News In Telugu | నేషనల్