/rtv/media/media_files/2025/04/25/4DzJXsIiVxHxvyIJmrrd.jpg)
kasthuri
ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ ఛైర్మన్ డా.కృష్ణస్వామి కస్తూరి రంగన్ కన్నుమూశారు. బెంగళూరులో ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కస్తూరి రంగన్ 1990-1994 వరకు యూఆర్ఎసీ డైరెక్టర్ గా పని చేశారు.అనంతరం ఆయన 9 సంవత్సరాల పాటు ఇస్రో ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు.
Also Read: ఉలిక్కిపడ్డ 'బెజవాడ'.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు..!
ఆయన హయంలో ఇస్రో తొలి లూనార్ మిషన్కు అడుగులు పడిన సంగతి తెలిసిందే.జేఎన్యూ ఛాన్సలర్ గా,కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్ గా కస్తూరి రంగన్ పని చేశారు. 2003- 09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ వ్యవహరించారు.
అంతేకాకుండా ప్రస్తుతం రద్దయిన ప్రణాళిక సంఘం సభ్యుడిగానూ సేవలందించారు. అలాగే 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ కు డైరెక్టర్ గా పని చేశారు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా పని చేశారు.
Also Read:Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్.. ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!
Also Read:Telangana: నిప్పుల కుంపటిల రాష్ట్రం.. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
isro | former-chairman | passed-away | latest-news | telugu-news