Vijayasai Reddy: విజయసాయిరెడ్డి మరో సంచలన ట్వీట్!

పుణేలో గిల్లియన్-బ్యారే సిండ్రోమ్ కేసులు 100కిపైగా రావడం అత్యంత ఆందోళనకరమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ వ్యాధి అనూహ్యంగా పెరగడానికి గల కారణాలను లోతుగా పరిశీలించాలని కేంద్రాన్ని కోరారు. పాలిటిక్స్ కు దూరమంటూ ఇటీవల ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.

New Update
Vijayasai Reddy tweet

Vijayasai Reddy tweet

తాను ఇక రాజకీయాలకు దూరం అంటూ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) తాజాగా మరో ట్వీట్ చేశారు. పుణేలో ఒక వారంలో గిల్లియన్-బ్యారే సిండ్రోమ్ కేసులు 100కిపైగా రావడం అత్యంత ఆందోళనకరమన్నారు. రోగుల చికిత్స కోసం ఉత్తమ వైద్య సౌకర్యాలు అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాధి అనూహ్యంగా పెరగడానికి గల కారణాలను లోతుగా పరిశీలించాలని కోరారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిరోధించేందుకు దృఢమైన చర్యలు తీసుకోవాలన్నారు. 

Also Read :  రిపబ్లిక్ వేడుకల్లో డ్యాన్స్ తో దుమ్మురేపిన కృష్ణా జిల్లా కలెక్టర్ దంపతులు.. వీడియోలు వైరల్!

Also Read :  ఆ భయంతోనే విజయసాయి రాజీనామా.. బయటకు చెప్పకపోయినా అసలు నిజం అదే!

విజయసాయి నిర్ణయంపై భిన్న విశ్లేషణలు..

పాలిటిక్స్ నుంచి వైదొలిగుతున్నట్లు ఇటీవల విజయసాయిరెడ్డి సోషల్ మీడియా (Social Media) లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం ఆయన రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాపై భిన్న కథనాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీలో చేరేందుకే ఆయన ఇలా చేశారన్న ప్రచారం సైతం ప్రారంభమైంది. అయితే విజయసాయిరెడ్డి మాత్రం తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే.. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన సీటు బీజేపీకే దక్కే ఛాన్స్ ఉంది. దీంతో బీజేపీ (BJP) కి మేలు చేసేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారన్న విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి.

Also Read :  ఎక్కువ మాట్లాడకు.. బండి సంజయ్ కు పొన్నం వార్నింగ్!

Also Read :  సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు కేసుపై RGV సంచలన ట్వీట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు