/rtv/media/media_files/2025/01/26/TMTA93S0BTFXwivKlj3Z.jpg)
Ponnam Prabhakar Bandi sanjay
ఇందిరమ్మపై అవహేళన గా మాట్లాడితే ఊరుకునేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఎలా ఇవ్వరో మేము చూస్తామన్నారు. ఇందిరను బీజేపీ ప్రధాని అయిన వాజ్ పేయి కాళీమాత తో పొల్చారని గుర్తు చేశారు. 10 నెలల కాలంలో జీఏస్టీ రూపం లో రూ.37 వేల కోట్లను కేంద్రం వసూలు చేసిందన్నారు. మరి కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఎంత? అని ప్రశ్నించారు. దీన్ దయాల్ అంత్యోదయ , దీన్ దయాల్ గృహ జ్యోతి లాంటి పేర్లు పథకాలకు ఎందుకు పెట్టారు? అని క్వశ్చన్ చేశారు. వీరు ఏమైనా దేశం కోసం ప్రాణత్యాగం చేశారా? అని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి... కీలక ప్రకటన
ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా ప్రయోజనం సున్నా..
తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క రూపాయన్న కేంద్రం నుంచి అదనంగా తెచ్చారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ ను ప్రశ్నించారు. భారతీయులు ఇందిరమ్మను ఇంకొక్క మాట అన్న ఊరుకోరని హెచ్చరించారు. పథకాలకు దరఖాస్తులు తీసుకుంటుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు అని అడుగుతున్నారని ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay : 'ఇందిరమ్మ’ పేరు పెడితే ఇండ్లు ఇవ్వం..బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
కేటీఆర్ తో పాటు ఏ ఊరికి అయిన వచ్చేందుకు సిద్ధమన్నారు. ఒక్క లబ్ధిదారుడికైనా అన్యాయం జరిగినా అడగాలన్నారు. అసహనానికి కేటీఆర్ పరాకాష్ట అని విమర్శించారు. బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసం తర్వాత కూడా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామన్నారు. కేటీఆర్ కు కాంగ్రెస్ సంక్షేమం జీర్ణం కావడం లేదన్నారు. అందుకే ఈనో ప్యాకెట్లు పంపిస్తానని ఎద్దేవా చేశారు.