TDP MLA Bandaru Satyanarayanamurthy: MLAగా ఉన్నందుకు సిగ్గు పడుతున్నా.. ప్రజల్లో తిరగలేక పోతున్నా!

విశాఖ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పార్టీ అధిష్టానంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారని మహానాడు వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు.

New Update
ap tdp

Visakhapatnam TDP MLA Bandaru Satyanarayanamurthy shocking comments

c: విశాఖ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి షాకింగ్  కామెంట్స్ చేశారు. ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ మహానాడు వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారని అన్నారు.

నియోజకవర్గాలపై వివక్ష

'నేను ప్రజల్లో తిరగలేకపోతున్నా. ఏం సమాధానం చెప్పలేకపోతున్నా. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయా. చోడవరం, మాడుగుల నియోజకవర్గాలపై వివక్ష చూపిస్తున్నారు. ప్లానింగ్ బోర్డు మీటింగ్లో ప్రస్తావించి నిధులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. మాడుగుల చోడవరం ప్రజలు టీడీపీకీ ఓటు వేయలేదా? ప్రశ్నించే వేదిక ఇదే.. నేను ప్రెస్ మీట్ పెట్టి అడగడం లేదు. ఆరోపించడం లేదు. అందుకే మహానాడు ద్వారా మంత్రులను నియోజకవర్గం ప్రజల తరపున ప్రశ్నిస్తున్నా' అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: అమెరికా అమెరికాలోనే ఉంది..భారత్, పాక్ కాల్పుల విరమణలో దాని జోక్యం లేదు..జైశంకర్

Also Read: మావోయిస్టు మృతుల వివరాలు వెల్లడించిన పోలీసులు.. తెలుగువారి లిస్ట్ ఇదే!

 tdp | mla | vishakapatnam | telugu-news | today telugu news 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు